E-Paper
Advertisement

KTR: చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌పై కక్షసాధింపా? ఫోన్ ట్యాపింగ్ నోటీసులపై కేటీఆర్ సంచలన ట్వీట్

KTR: చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌పై కక్షసాధింపా? ఫోన్ ట్యాపింగ్ నోటీసులపై కేటీఆర్ సంచలన ట్వీట్
Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.

‘చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ సచ్చుడో– తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్’ అని కేటీఆర్ కొనియాడారు. సాధించిన తెలంగాణను పదేళ్ల పాలనలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిపిన విజనరీ ఆయనేనని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలతో అన్ని వర్గాలను చంటిబిడ్డల్లా సాకిన నాయకుడిపై ఇప్పుడు విచారణల పేరుతో వేధింపులకు దిగడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాది కాలంలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టిందని కేటీఆర్ విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే కేసీఆర్‌పై నోటీసుల అస్త్రాన్ని ప్రయోగించారని ఆరోపించారు. ‘ఇది విచారణ కాదు.. ప్రతీకారం. ఇది న్యాయం కాదు.. రాజకీయ దురుద్దేశం’ అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

నోటీసులతో లేదా బెదిరింపులతో తెలంగాణ చరిత్రను గానీ, కేసీఆర్ ముద్రను గానీ చెరిపేయలేరని కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే రాష్ట్ర ప్రజలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందని, ప్రజల పక్షాన నిలబడి ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. తెలంగాణ చరిత్ర విచారణలతో కాకుండా ప్రజల తీర్పుతోనే రాయబడుతుందని ఆయన తేల్చి చెప్పారు.

ALSO READ: YV Subba Reddy: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చేసింది: ఢిల్లీలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×