KTR: మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. డ్రగ్స్ ,అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా నేను వ్యతిరేకం అని స్పష్టం చేశారు.మా పార్టీ బీఆర్ఎస్ డ్రగ్స్ వాడకాన్ని, చట్టవిరుద్ధ కార్యకలాపలనైనా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. డ్రగ్స్ వాడుతున్న వారు లేదా విక్రయిస్తున్న వారు (పెడ్లర్లు), వారి రాజకీయలతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించబడాలని డిమాండ్ చేశారు.
Also Read: HYDRAA: రూ. 250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
ఈ అంశంలో నీచమైన రాజకీయాల కోసం మా బీఆర్ఎస్ పార్టీని లాగుతున్న తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. డ్రగ్స్ కేసును బీఆర్ఎస్ పార్టీపై రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం మీ అసహ్యకరమైన రాజకీయాలకు నిదర్శనం అని మండిపడ్డారు. ‘నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాను అని వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్ సూచనను నేను స్వాగతిస్తున్నాను.. మనమే ఆదర్శంగా నిలుద్దాం. అని పిలుపు నిచ్చారు. ప్రతి డ్రగ్స్ కేసులోకి నా పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులిస్తానని తీవ్రంగా హెచ్చరించారు.
Also Read: Rashmika Mandanna: మరిది పుట్టినరోజు..మిస్ అవుతున్నాం అంటూ రష్మిక స్పెషల్ విషెస్!