E-Paper
Advertisement

Lagacharla Case: లగచర్ల కేసు.. కీలకంగా మారిన టెక్నికల్ ఎవిడెన్స్, దాడికి ముందు

Lagacharla Case: లగచర్ల కేసు.. కీలకంగా మారిన టెక్నికల్ ఎవిడెన్స్, దాడికి ముందు
Advertisement

Lagacharla Case: లగచర్ల దాడి కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? టెక్నికల్ ఆధారాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారా? నిందితులు ఉపయోగించిన ఫోన్ నెంబర్లు ఆధారంగా ఓ అడుగు ముందుకేశారా? ఘటనకు ముందు అంటే వారం కిందట ఏం జరిగింది? నిందితులు ఎవరెవర్ని కలిశారు? అనేదానిపై ఆరా తీసే పనిలో పడ్డారు విచారణ అధికారులు.

లగచర్ల కేసు ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు అధికారులు. ఈ ఘటనలో టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు ఓ అడుగు ముందుకేశారని చెప్పవచ్చు.

Advertisement

ఘటనకు వారం ముందు ప్రధాన నిందితులు సురేష్, పట్నం నరేందర్‌‌రెడ్డిలు కలిసి అక్టోబర్ 25న జూబ్లీహిల్స్‌లో నందినగర్‌ కేటీఆర్ ఇంటికి వచ్చినట్టు సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. నిందితుల సెల్ ఫోన్ టవర్ లొకేషన్ డేటాను సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సేకరించారు.

పట్నం నరేందర్‌రెడ్డి ఐఫోన్ ఓపెన్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. పాస్ వర్డ్ మర్చిపోయానని చెప్పడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించే పనిలో పడ్డారట. న్యాయస్థానం ఆదేశాలతో ఫోన్ ఓపెన్ చేసి డేటా రికవరీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

ALSO READ: మాట మార్చిన కేటీఆర్.. చివరి వరకు ఆయనే? కొత్త రాగం వెనుక

ఇదిలావుండగా ఘటన జరిగిన రోజు ఆధారాలు ఎవరికీ దొరక్కుండా ఉండేలా సురేష్ తన ఫోన్ పగలగొట్టి చెత్తలో వేశానని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సెల్ ఫోన్ లో ఏముందనేది కీలకంగా మారింది. నవంబర్ 11న జిల్లా కలెక్టర్‌పై దాడి జరిగింది. అంతకు రెండువారాల ముందు కొడంగల్‌కు చెందిన పలువురు బీఎస్పీ కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి.. కేటీఆర్‌తో భేటీ అయినట్టు పోలీసుల అంచనా. నిందితులు నోరైనా విప్పాలి? లేకుంటే ఫోన్ డేటా రికవరీ అయినా కావాలి? ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితే కేసు కీలక మలుపు తిరిగే అవకాశముందని అంటున్నారు కొందరు పోలీసు అధికారులు.

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×