BigTV English

Lizard In Biryani : బాబోయ్ బిర్యానీలో బల్లి.. 8 మందికి అస్వస్థత

Lizard In Biryani : బాబోయ్ బిర్యానీలో బల్లి.. 8 మందికి అస్వస్థత
hyderabad latest news

Lizard In Biryani(Hyderabad latest news) :

బిర్యానీ అనగానే గుర్తొచ్చేది మన హైదరాబాద్. ఇక్కడి దమ్ బిర్యానీ అంత ఫేమస్. వరల్డ్ ఫేమస్ అయిన హైదరాబాదీ బిర్యానీ నిజాం నవాబుల కాలం నుంచీ ఉంది. హైదరాబాద్ బిర్యానీ అంటే నగర ప్రజలకు ఓ ఎమోషన్. ప్రపంచ ఉత్తమ ఆహార పదార్థాల జాబితాలో మన హైదరాబాద్ బిర్యానీ స్థానం సంపాదించుకుంది.


ఇక హైదరాబాద్‌లో గల్లీకో బిర్యానీ సెంటర్ ఉంటుంది. భోజన ప్రియులు తమకు నచ్చిన చోటుకి వెళ్లి బిర్యానీని లాగిస్తుంటారు. కొన్ని సార్లు హోటల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆహరంలో బల్లులు, బొద్దింకలు ఇలాంటివి వస్తుంటాయి.అవి తెలియకుండా తినే వారు అస్వస్థతకు గురవుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ డైరీ ఫామ్ చౌరస్తాలో ఉన్న ఎలైట్ హోటల్ లో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది మంది ఆ హోటల్‌లో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. ఆకలిగా ఉన్న వారంతా బిర్యానీ రాగానే ఫాస్ట్‌గా తినేశారు. కానీ చివరలో తమ ప్లేట్లలో ఒక చిన్న తోక వంటిది కనిపించింది. పరిశీలించి చుడాగా ఆ బిర్యానీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా వరందరు షాక్‌కి గురయ్యారు.


వారిలో కొందరు అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. వెంటనే బాధితులను అత్తపూర్‌లోని జాయ్ అసుపత్రికి తరలించారు. ఎలైట్ హోటల్ యజమాని పై చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు స్థానికులు డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ లోని చాలా హోటల్స్ లో పరిస్థితి దీనంగా ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Tags

Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 29 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×