Dog Attack: వీధి కుక్కల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా, ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఓ వైపు మనుషులపై దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు పిచ్చి కుక్కలు రెచ్చిపోతున్నాయి. తాజాగా ఓ పిచ్చి కుక్క.. 36 మందిపై దాడి చేసింది. చివరకు ఓ బాధితుడు దాన్ని చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. ఎక్కడ.. ఏంటి?
రంగారెడ్డి జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో ఈ దారుణం వెలుగుచూసింది. ఓ పిచ్చికుక్క 36 మందిపై దాడి చేసింది. ప్రధాన రహదారిపై రద్దీగా ఉండే ప్రదేశంలో కనిపించిన వారందరిపై దాడి చేసింది. చివరకు ఓ బాధితుడు ఆ కుక్కను చంపేశాడు. గాయపడిన వారంతా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు.
ఒక్కసారి అంతమందిని దాడి చేయడంపై వైద్యులు షాకయ్యారు. కుక్క కాటుకు గురైన 36 మందికి చికిత్స అందించామని తెలిపారు. ఉన్నట్లుండి పిచ్చి కుక్క ఈ స్థాయిలో దాడి చేయడంపై స్థానికులు బెంబేలెత్తిపోయారు. రోడ్లపై వెళ్లే కుక్కలను చూసి ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు.
36 మందిపై దాడి.. ఆసుపత్రికి బాధితులు
కుక్కల దాడి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. న్యాయస్థానాలు ఆదేశాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నాయి. అయినా దాడుల ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్గా హైదరాబాద్ శివారులో ఓ మూగబాలుడిపై కుక్క దాడి చేసింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఈ విషయం తెలిసింది. వెంటనే అధికారులను ఆదేశించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి ఆమన్గల్ పట్టణంలో ఏకంగా పిచ్చికుక్క వంతైంది. కుక్కల పెరుగుదలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రాంతవాసులు కోరుతున్నారు.
ALSO READ: ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ
పిచ్చి కుక్క స్వైర విహారం….36 మందిపై దాడి
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ లో పిచ్చి కుక్క స్వైర విహారంతో 36 మంది గాయపడ్డారు
రోడ్డుపై కనిపించిన వారిందరినీ కుక్క కరుచుకుంటూ వెళ్లింది
దాంతో ఆగ్రహించిన బాధితులు కుక్కను చంపివేశారు
పిచ్చి కుక్క దాడిలో గాయపడిన వారిని స్థానికులు… pic.twitter.com/XayHMA70nV
— BIG TV Breaking News (@bigtvtelugu) December 8, 2025