E-Paper
Advertisement

AP News: కృష్ణుడి విగ్రహం టచ్ చేస్తే ఊరుకోం.. మంగళగిరిలో హై టెన్షన్

AP News: కృష్ణుడి విగ్రహం టచ్ చేస్తే ఊరుకోం.. మంగళగిరిలో హై టెన్షన్
Advertisement

AP News: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడి కూడలిలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగడంతో, ఈ చర్యను అడ్డుకునేందుకు యాదవుల సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఈ విగ్రహం తొలగింపు ప్రక్రియ అంతా కోర్టు ఆదేశాల మేరకే జరుగుతుందన్నారు. అంతేకాకుండా మంగళగిరిలోని కృష్ణుడి విగ్రహం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దానిని తొలగించాలని కోరుతూ మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, విగ్రహాన్ని తొలగించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల అమలులో భాగంగానే, మున్సిపల్ సిబ్బంది విగ్రహం తొలగింపు పనులను ప్రారంభించారు.

Advertisement

అయితే కోర్టు ఆదేశాలు వచ్చినప్పటికీ, స్థానికుల అభ్యంతరాల దృష్ట్యా ఈ విగ్రహాన్ని తొలగించడం మున్సిపల్ సిబ్బందికి అంత సులభం కాలేదు. విగ్రహం తొలగింపు పనులు ప్రారంభించిన వెంటనే, స్థానికులు, యాదవ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకుని, నిరసన తెలియజేశారు.

ఈ విగ్రహంపై తమకు ఎంతో భక్తి, విశ్వాసం ఉన్నాయని యాదవ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదంటూ వారు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణుడి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించడానికి వీలు లేదంటూ నినాదాలు చేస్తూ, మున్సిపల్ సిబ్బంది చుట్టూ గుమిగూడారు.

Advertisement

Also Read: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కింద పడి 11 ఏళ్ల బాలుడు మృతి.

దీంతో అక్కడి ప్రాంతం అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను శాంతింపజేయడానికి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే, ఆందోళనకారులు తమ డిమాండ్‌పై పట్టుబట్టడంతో, ఇందిరానగర్ ప్రాంతంలో తీవ్ర తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×