E-Paper
Advertisement

పక్కన కూర్చుంటే తప్పేంటి.. ప్రోటోకాల్ ఉల్లంఘనా.. మేయర్ మమత ఫైర్..?

పక్కన కూర్చుంటే తప్పేంటి.. ప్రోటోకాల్ ఉల్లంఘనా.. మేయర్ మమత ఫైర్..?
Advertisement

Mayor Mamata: స్వేచ్ఛ బ్యూరో: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి బడ్జెట్ సమావేశంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదంపై మేయర్ మమత ఘాటుగా స్పందించారు. ఆదివారం ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, బీఆర్ఎస్ కార్పొరేటర్లు సృష్టించిన రగడ వెనుక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రేరేపణ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్న జరిగిన సమావేశంలో ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేస్తూ, ఈ వివాదాన్ని రాజకీయంగా మలచడం సరైంది కాదన్నారు.

రాజకీయాలకు కొత్తగా వచ్చాను..

ఈనెల 28న జరిగిన తొలి బడ్జెట్ సమావేశంలో మేయర్ మమత పక్కన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి కూర్చోవడం వివాదానికి దారి తీసింది. మేయర్ మాత్రమే పోడియంలో కూర్చోవాలని పేర్కొంటూ బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై స్పందించిన మమత, “నేను రాజకీయాలకు కొత్తగా వచ్చాను. నాకు ధైర్యం ఇవ్వడానికి ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ నా పక్కన కూర్చున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు” అని తెలిపారు. అలాగే “ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి నన్ను సొంత చెల్లెలిలా చూసుకుంటూ నైతిక బలం ఇస్తున్నారు” అని పేర్కొన్నారు.

Advertisement

Also Read: ఇవి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లా.. సర్కార్ పై ఈటల రాజేందర్ నిప్పులు..!

ఆవేదన వ్యక్తం..

బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్‌పై ఆమె తీవ్రంగా స్పందిస్తూ, “కీలకమైన బడ్జెట్ సమావేశం నుంచి బయటకు వెళ్లడం బాధాకరం. ఇది బీఆర్ఎస్ నాయకులకు కాదు… ప్రజలకు నష్టం. సభ్యుల వాకౌట్ వల్ల ప్రజల సమస్యలు చర్చకు రాకుండా పోయాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే “వాళ్లు స్వచ్ఛందంగా వెళ్లలేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిశానిర్దేశంతోనే సభ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది” అని ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై మమత మరింత ఘాటుగా స్పందిస్తూ, “గత పదేళ్లుగా నా కుటుంబాన్ని అణగదొక్కారు. ఇప్పుడు నన్నే టార్గెట్ చేస్తున్నారు.

సహించేది లేదు

Advertisement

ఇకపై ఇలాంటి రాజకీయ ఒత్తిడిని అస్సలు సహించేది లేదు. మీ పని మీరు చూసుకోండి. మీ గౌరవం నిలుపుకునేలా ప్రవర్తించండి” అంటూ హెచ్చరించారు.
ఆదివారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెద్దగొళ్ల నరసింహులు యాదవ్, రామస్వామి తదితరులతో పాటు యువ నాయకుడు గుమాల్ శ్రీనివాస్ ముదిరాజ్ కూడా పాల్గొని మేయర్‌కు మద్దతు తెలిపారు. కార్పొరేషన్ సమావేశంలో తలెత్తిన ఈ వివాదం పట్టణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారగా, రాబోయే రోజుల్లో మరింత రాజకీయ వేడి రగిలించే అవకాశం కనిపిస్తోంది.

Also Read: ట్రై కమిషనరేట్లలో మందుబాబుల మజాకా.. పోలీసుల తడాఖా..!

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×