Fire Accident: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహిన్నగర్లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక సాయిబాబా ఆలయం వెనుక భాగంలో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఘటన వివరాల ప్రకారం, తెల్లవారుజాము 3:30 గంటల సమయంలో ప్లాస్టిక్ గోదాముల్లోని ఒక యూనిట్లో మంటలు స్టార్ట్ అయ్యాయి. షాహీన్ నగర్ ప్రాంతం ప్లాస్టిక్ వ్యాపారులకు ప్రసిద్ధిగా ఉండటంతో, ఇక్కడ ఎక్కువ ఎత్తున ప్లాస్టిక్ మెటీరియల్, స్క్రాప్, రీసైకిలింగ్ పదార్థాలు నిల్వ చేస్తూ ఉంటారు. ఈ మెటీరియల్ సులభంగా మంటలకు గురవుతుంది కాబట్టి, మంటలు త్వరగా వ్యాపించి భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని తాకుతూ, సమీప ప్రాంతాల్లోకి వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు గమనించిన స్థానికులు వెంటనే ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేశారు. హుటాహుటిగా రాచకొండ అగ్నిమాపక శాఖకు చెందిన రెండు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది మూడు గంటల పాటు కష్టపడి పోరాడి, మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే ఈ ఘటనపై బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ, “ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించాము. మంటలు షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగినట్టు కనిపిస్తోంది. అయితే, ఇది ఉద్దేశపూర్వక అగ్నిప్రమాదమా లేదా ఇతర కారణాల వల్లా అనేది దర్యాప్తులో తేలనుంది” అని తెలిపారు. పోలీసులు ఫోరెన్సిక్ టీమ్తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. గోదాము యాజమాన్యం వద్ద నుండి ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: విద్యార్థులకు అలర్ట్..! నేడు ప్రైవేటు విద్యాసంస్థలు బంద్..
ఈ అగ్నిప్రమాదంలో గోదాములో నిల్వ చేసిన ప్లాస్టిక్ షీట్లు, పైపులు, రీసైకిల్ మెటీరియల్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. మొత్తం ఆస్తి నష్టం రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు, రాత్రి సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అంతేకాకుండా పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్కు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే స్థానికులు ఈ ఘటనపై భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా షాహిన్నగర్లోని ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది pic.twitter.com/AN7mezAFn4
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2025