E-Paper
Advertisement

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం.. మల్లారెడ్డి చిలక పలుకులు, అదంతా మాయ

Jubilee Hills By-Election:  జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం.. మల్లారెడ్డి చిలక పలుకులు, అదంతా మాయ
Advertisement

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల నేతలు వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. లేటెస్టుగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బిగ్ టీవీతో మాట్లాడుతూ తడబడ్డారు.

వేడెక్కిన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం

Advertisement

గురువారం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు మాజీమంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా ‘బిగ్ టీవీ’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కారుని మళ్ళీ గెలిపిస్తారని మనసులోని మాటను బయట పెట్టారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని జూబ్లీహిల్స్ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

జూబ్లీహిల్స్‌లో రెండేళ్లుగా అభివృద్ధి లేదన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ బాకీ ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపో యిందని, ఒక్కప్లాట్ అమ్మిన సందర్భం లేదని నోరు జారారు. ఎకరం భూమి అమ్మి పెళ్లి చేద్దామంటే కొనుగోలు చేసేందుకు ఎవరూ రాలేదన్నారు.

Advertisement

మేమే గెలుస్తాం-మల్లారెడ్డి

రీసెంట్‌‌గా గచ్చిబౌలిలో భూముల వేలంలో ఎకరం 177 కోట్లకు వెళ్లిందని ప్రశ్నించారు సదరు జర్నలిస్టు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అదంతా మాయ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి. వరంగల్, మేడ్చల్‌లో ఎకరం కనీసం రెండు కోట్లకు అమ్ముడుపోవట్లేదని నవ్వుతూ తన మాటలను కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి. స్టార్ క్యాంపెయినర్ కేసీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. తనకు ఇప్పుడు 72 ఏళ్లు వచ్చాయని, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చేసరికి 75 ఏళ్లు వస్తాయన్నారు. తనకు వయసు అయిపోతుందని, మళ్ళీ మంత్రి కావాలనే ఆశ లేదన్నారు.

ALSO READ:  తెలంగాణ ప్రజలకు తీపికబురు చెప్పిన ప్రభుత్వం

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని అన్నారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలంటే మళ్లీ సునీతకు ఓటు వేసి గెలిపించాలన్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఇంటింటికీ ప్రచారం చేస్తోంది.  ఇంకోవైపు బీజేపీ నేతలు ప్రచారంలోకి దిగేశారు.  అభివృద్ది కావాలంటే తమ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.

 

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×