E-Paper
Advertisement

Mahabubabad : ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం.. మూడు రోజులు జరగనున్న ఉత్సవాలు

Mahabubabad : ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం.. మూడు రోజులు జరగనున్న ఉత్సవాలు
Advertisement

Mahabubabad : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామికి 50 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామానికి తూర్పు వైపున ఉన్న దేవుని గుట్టపై మల్లికార్జున స్వామి వెలసినట్లు అక్కడి గ్రామస్తులు పేర్కొన్నారు. అప్పటి నుండి భక్తులు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించడం అనవాయితిగా వస్తుంది.

ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. జాతర జరిగిన మూడు రోజులపాటు అటవీ ప్రాంతం మొత్తం మల్లన్న నామస్మరణతో మారమవుతుంది. ఉత్సవాల్లో భాగంగా మల్లికార్జున స్వామి మేడాలమ్మ, కేతమ్మ కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

అనంతరం డోలు వాయిద్యాలు నడుమ బోనాలతో భక్తులు మొక్కులు చెల్లించారు. జాతరకు మాత్రం కనీస సౌకర్యాలు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు మండలం మచ్చర్ల గ్రామం నుండి సుమారు 5 కిలోమీటర్లు లోపలకి వెళ్తే అటవీ ప్రాంతంలో జాతర నిర్వహిస్తూ ఉంటారు. జాతరలో కనీస సౌకర్యాలను కల్పించాలని భక్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×