Homemade Wine: స్వేచ్చ బ్యూరో: యూ ట్యూబ్ చూసి వైన్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. ఆ తరువాత ఇంట్లోనే పెద్దమొత్తంలో వైన్ తయారు చేస్తూ అమ్మటం ఆరంభించాడు. చివరకు ఎక్సయిజ్ అధికారులకు పట్టుబడ్డాడు. పక్కాగా సమాచారాన్ని సేకరించి నిందితున్ని పట్టుకున్న అధికారులు నిందితుని నుంచి 377 లీటర్ల వైన్ ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంటోనీ పీటర్ అనే వ్యక్తి తేలికగా డబ్బు సంపాదించేందుకు ఇంట్లోనే వైన్ తయారు చేయటం మొదలు పెట్టాడు. గ్రేప్స్, పైనాపిల్, జామ, మోసంబీ, సపోటా, అరటిపండు, తమలపాకు ఫ్లేవర్లతో వైన్ తయారు చేసి 740 మిల్లీలీటర్ల బాటిళ్లలో నింపుతున్నాడు. ఆ తరువాత నేరెడ్ మెట్, సికింద్రాబాద్, కాప్రా తదితర ప్రాంతాల్లో ఒక్కో బాటిల్ ను 3వందల రూపాయలకు అమ్ముతున్నాడు. ఈ మేరకు సమాచారం అందగా మల్కాజిగిరి డీటీఎఫ్ సీఐ భరత్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డితోపాటు సిబ్బందితో కలిసి నిందితుని ఇంటిపై దాడి చేశారు.
Also Read: బాలీవుడ్ పై విమర్శలు గుప్పించిన సోనాలి బింద్రే.. టాలీవుడ్ ఎంతో బెటర్ అంటూ!
పెద్ద మొత్తంలో 502 బాటిళ్ల వైన్ను స్వాధీనం చేసుకుని ఆంటోనీ పీటర్ను అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన వైన్ విలువ లక్షా 50వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితునిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం కాప్రా ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.
Also Read: Server Glitch: మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో నిలిచిపోయిన సేవలు..!