E-Paper
Advertisement

వరంగల్ కాంగ్రెస్‌లో ‘సునామీ’.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ ఫిర్యాదు, రేవంత్ ఏం చేయబోతున్నారు?

వరంగల్ కాంగ్రెస్‌లో ‘సునామీ’.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ ఫిర్యాదు, రేవంత్ ఏం చేయబోతున్నారు?
Advertisement

Warangal Congress: వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న ‘ప్రోటోకాల్ వార్’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేవాదాయ శాఖ పరిధిలోని ఒక సమావేశం కాస్తా.. ఇద్దరు అగ్ర నేతల మధ్య ఆధిపత్య పోరుకు వేదికైంది. ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారి చివరకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ గడప తొక్కినంత వరకు వెళ్లింది.

వివాదానికి కారణమైన సమీక్షా సమావేశం

Advertisement

ఇటీవల దేవాదాయ శాఖ (ఎండోమెంట్) ప్రధాన కార్యాలయంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశమే ఈ రచ్చకు కారణమైంది. స్థానిక ఎమ్మెల్యేగా, ఆలయ కమిటీ బాధ్యుడిగా కడియం ఈ సమీక్ష నిర్వహించారు. అయితే, తన శాఖలో తనకు కనీస సమాచారం ఇవ్వకుండా కడియం ఎలా జోక్యం చేసుకుంటారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోపంతోనే ఆమె ప్రజాభవన్‌లో జరిగిన ఓ కీలక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు కూడా హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. తన శాఖపై కడియం పెత్తనం ఏంటని ఆమె హైకమాండ్‌కు గట్టిగానే ఫిర్యాదు చేశారు.

Also Read: అంతరిక్షంలోకి మన వరంగల్ కళ.. సూది రంధ్రంలో సైన్స్ దిగ్గజాలు, అమెరికాను సైతం అధిగమించి..

Advertisement

ఆధిపత్య పోరు.. అధిష్టానం డైలమా

ఈ వివాదం కేవలం ప్రోటోకాల్‌కు సంబంధించింది మాత్రమే కాదు, వరంగల్ జిల్లాలో భవిష్యత్ రాజకీయ ఆధిపత్యం కోసమేనని స్పష్టమవుతోంది. కడియంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సురేఖ పట్టుబడుతుండగా.. ఆయనలాంటి సీనియర్ నేతపై చర్యలు తీసుకునే సాహసం అధిష్టానం చేస్తుందా? అన్నది అనుమానమే. ఈ అంతర్గత పోరు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారడమే కాకుండా, ప్రతిపక్షాలకు మంచి ఆయుధంగా దొరికింది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ ‘వరంగల్ వార్’కు ఎలా ఫుల్‌స్టాప్ పెడతారో చూడాలి.

తప్పుగా అర్థం చేసుకున్నారు.. కడియం కౌంటర్

మంత్రి కొండా సురేఖ చేసిన ఫిర్యాదుపై కడియం శ్రీహరి అంతే ఘాటుగా స్పందించారు. మంత్రి తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా అధికారులను కలిసి సమస్యలపై వినతిపత్రం ఇచ్చే హక్కు తనకు ఉందన్నారు. తాము అసలు సమీక్షే నిర్వహించలేదని, కేవలం ఆలయాల అభివృద్ధి కోసమే దేవాదాయ కార్యాలయానికి వెళ్లానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని వారే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారంటూ ఆయన మంత్రి సురేఖపై ఎదురుదాడికి దిగారు.

Also Read: ఇక అంతా ఈవీల రాజ్యమేనా? జూన్ సేల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Related News

15 రోజుల్లో 618 ఫోన్ల ట్యాపింగ్.. సిట్ వలలో ముగ్గురు బీఆర్ఎస్ బడా నేతలు!

భార్య, ప్రియుడు.. ఒక మర్డర్ స్కెచ్! మియాపూర్ సత్యవతి క్రైమ్ స్టోరీ!

మరో పిడుగు.. E20 స్థానంలో E25 ఇంధనం, ధర తగ్గుతాది ఒకే.. మరి ఆ డ్యామేజ్?

సిటీలో కోచింగ్ సెంటర్ల గుట్టురట్టు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం.. నీరవ్ మోడీ లండన్ జైలు టు ఇండియా.. పూర్తి వివరాలు!

తాజ్‌మహల్ కింద ఉన్న రహస్యం ఏంటి? సమాధా.. శివాలయమా?

పవన్‌పై చీటింగ్ కేసు.. సుగాలి ప్రీతి ఎపిసోడ్ వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×