Seethakka: 1000 రోజుల ప్రజా పాలన మహిళా సదస్సు మోర్తాడ్ సభకు హజరై మంత్రి సీతక్క ప్రసంగించారు. బిఆర్ఎస్ పార్టీ అంటేనే తప్పుడు పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. బిఆర్ఎస్ అంటేనే అబద్ధాల పార్టీఅని, వాల్లు చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మంత్రి సీతక్క తెలిపారు. నీచమైన అబద్ధాలు ఆడటం బిఆర్ఎస్ కు అలవాటై పోయిందని సంచన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో బిఆర్ఎస్ వికృత చేష్టలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దళిత నేతలను అవమానపరుస్తున్నారని బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం అని మంత్రి అన్నారు. మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం పై కూడా ప్రతిపక్షం కావాలని రాద్ధాంతం చేయటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేక పోతున్నారని ఫైర్ అయ్యారు.
Also read: వివాదంలో బిగ్ బాస్ షో.. విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై క్లారిటీ!
తెలంగాణలో ఉన్న మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయటమే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి సీతక్క తెలిపారు. మేము ఉచిత సన్న బియ్యం ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్ వాడి ఉద్యోగాల భర్తీ పూర్తి చేసి మహిళలకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు.
Also read: దీపావళికి రైల్వే గుడ్ న్యూస్.. 100కు పైగా స్పెషల్ ట్రైన్లు!