Medaram Jatara: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర భక్తజన సంద్రమైంది. బుధవారం కావడంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే.. భక్తల రద్దీ ఎక్కవగా ఉన్న సమయంలో కొందరు చేసిన అనాలోచిత పనుల వల్ల ప్రమాదం చోటుచేసుకుంది.
సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్న కొందరు భక్తులు ఉత్సాహంతో తమ మెుక్కులు చెల్లించుకునే క్రమంలో కొబ్బరికాయలను గద్దెలపైకి విసిరారు. ఈ క్రమంలో అవి ఇతర భక్తులకు తగలడంతో ఏకంగా ఐదుగురు భక్తులు గాయపడ్డారు. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆలయ కమిటీ తెలిపారు.
ఈ ఘటనపై ఆలయ కమిటీ, పోలీసులు తీవ్రంగా స్పందించారు. భక్తుల రక్షణ దృష్ట్యా గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరడం నిషిద్ధమని స్పష్టం చేశారు. ఇా విసరడం వల్ల తోపులాటలు జరగడమే కాకుండా.. ఎదురుగా ఉన్న భక్తులకు తలలకు తగిలి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మెుక్కులు చెల్లించుకునే వారు క్రమశిక్షణతో ఉండాలని.. అధికారులకు సహకరించాలని కమిటీ కోరింది.
మేడాం జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ.. భక్తులు క్రమశిక్షణ పాటించినప్పుడే జాతర విజయవంతమవుతుందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
ALSO READ: వన్ చైల్డ్ నుంచి నో చైల్డ్ దాకా.. చైనా యువత ఎందుకు వెనకడుగు వేస్తోంది?
మేడారంలో సమ్మక్క గద్దె వద్ద భక్తులు కొబ్బరికాయలు విసరడంతో ఐదుగురికి గాయాలయ్యాయి.
రెస్క్యూ బృందాలు వెంటనే స్పందించి బాధితులకు ప్రథమ చికిత్స అందించాయి.
భక్తులు ఎవరూ గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరకూడదని, నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని ఆలయ కమిటీ సూచించింది. pic.twitter.com/tNTjBKBPmE
— ChotaNews App (@ChotaNewsApp) January 21, 2026