E-Paper
Advertisement

Medaram Jatara: ముక్కులు చెల్లించే ఉత్సాహం.. ఐదుగురు భక్తుల ప్రాణాల మీదకు తెచ్చిన వైనం

Medaram Jatara: ముక్కులు చెల్లించే ఉత్సాహం.. ఐదుగురు భక్తుల ప్రాణాల మీదకు తెచ్చిన వైనం
Advertisement

Medaram Jatara: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర భక్తజన సంద్రమైంది. బుధవారం కావడంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే.. భక్తల రద్దీ ఎక్కవగా ఉన్న సమయంలో కొందరు చేసిన అనాలోచిత పనుల వల్ల ప్రమాదం చోటుచేసుకుంది.

సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్న కొందరు భక్తులు ఉత్సాహంతో తమ మెుక్కులు  చెల్లించుకునే క్రమంలో  కొబ్బరికాయలను గద్దెలపైకి విసిరారు. ఈ క్రమంలో అవి ఇతర భక్తులకు తగలడంతో ఏకంగా ఐదుగురు భక్తులు గాయపడ్డారు. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆలయ కమిటీ తెలిపారు.

Advertisement

ఈ ఘటనపై ఆలయ కమిటీ, పోలీసులు తీవ్రంగా స్పందించారు. భక్తుల రక్షణ దృష్ట్యా గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరడం నిషిద్ధమని స్పష్టం చేశారు. ఇా విసరడం వల్ల తోపులాటలు జరగడమే కాకుండా.. ఎదురుగా ఉన్న భక్తులకు తలలకు తగిలి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మెుక్కులు చెల్లించుకునే వారు క్రమశిక్షణతో ఉండాలని.. అధికారులకు సహకరించాలని కమిటీ కోరింది.

మేడాం జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు  చేసినప్పటికీ.. భక్తులు క్రమశిక్షణ పాటించినప్పుడే జాతర విజయవంతమవుతుందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

Advertisement

ALSO READ: వన్ చైల్డ్ నుంచి నో చైల్డ్ దాకా.. చైనా యువత ఎందుకు వెనకడుగు వేస్తోంది?

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×