Medchal Collector: మేడ్చల్ స్వేచ్ఛ: మున్సిపాలిటిలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మను చౌదరి సాధారణ ఎన్నికల పరిశీలకులు నిర్మల కాంతి వెస్లీతో కలిసి పరిశీలించారు. ఉదయం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆలియాబాద్లోని జిల్లా పరిషత్ హై స్కూల్, మూడుచింతలపల్లిలోని జగ్గన్గూడ జిల్లా పరిషత్ హై స్కూల్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని రాజబొల్లారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు.
Also Read: Rahul Gandhi: ప్రధాని మోదీ భారత్ను అమ్మేశారు? లోక్సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
బూతుల్లో పోలింగ్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, ఇప్పటివరకు ఎంతమంది ఓటర్లు ఓటు వేశారో ప్రిసైడింగ్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, వీల్చైర్, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని అధికారులను ప్రశ్నించారు. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఓటు వేయడానికి వీల్చైర్లో వచ్చిన వృద్ధురాలిని కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి, పేరు మరియు వయస్సు గురించి అడగగా, ఆమె తన పేరు కిష్టమ్మ, వయస్సు 65 సంవత్సరాలు అని తెలిపి ఓటు వేయడానికి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసింది.
Also Read: T20 WC Recharge Plans: ఉచితంగా T20 వరల్డ్ కప్.. ఎయిర్టెల్, విఐ, జియో బెస్ట్ రిఛార్జ్ ప్లాన్స్..