E-Paper
Advertisement

మేడ్చల్‌ స్వరూప నర్సింగ్ హోమ్‌లో షాకింగ్ సీన్.. కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి..?

మేడ్చల్‌ స్వరూప నర్సింగ్ హోమ్‌లో షాకింగ్ సీన్.. కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి..?
Advertisement

Nursing Home: స్వేచ్ఛ బ్యూరో: ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యశాలే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తే పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. మేడ్చల్‌ పట్టణంలోని ‘స్వరూప నర్సింగ్‌ హోమ్‌’పై స్థానికులు, రోగుల బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రి బయట ప్రముఖ వైద్యుల పేర్లు, ఎంబీబీఎస్‌ బోర్డులు దర్శనమిస్తున్నప్పటికీ.. లోపల మాత్రం అర్హతలపై అనుమానాలున్న వ్యక్తులతో వైద్యం చేయిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

బోర్డులపై పెద్ద డాక్టర్లు.. లోపల పరిస్థితి మరోలా?

ఆసుపత్రి వెలుపల వివిధ విభాగాలకు చెందిన వైద్యుల పేర్లు, అర్హతలను ప్రదర్శిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా రోగులకు చికిత్స అందించే సమయంలో సంబంధిత వైద్యులు అందుబాటులో ఉంటున్నారా? లేదా? అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హత కలిగిన వైద్యుల పర్యవేక్షణ లేకుండా చికిత్సలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంజెక్షన్లు, సెలైన్‌లు, ఇతర వైద్య సేవలు ఎవరు అందిస్తున్నారు? చికిత్స అందిస్తున్న సిబ్బందికి ఉన్న అర్హతలేంటి? డ్యూటీ డాక్టర్లు ఎవరున్నారు? అన్న విషయాలను అధికారులు తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

కిటికీకి సెలైన్‌.. ఇదేనా వైద్య ప్రమాణం?

Advertisement

ఆసుపత్రిలోని కనీస సౌకర్యాలపై కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రోగికి బెడ్‌ ఏర్పాటు చేయకుండా కిటికీకి సెలైన్‌ బాటిల్‌ కట్టి చికిత్స అందిస్తున్న దృశ్యాలు ఆసుపత్రి నిర్వహణ తీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. రోగులకు అవసరమైన బెడ్లు, పరిశుభ్రమైన వాతావరణం, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అన్నది అధికారుల తనిఖీల్లో తేలాల్సి ఉంది.

Also read: 1980s ఫోటో ట్రెండ్ వెనుక పెద్ద స్కామ్.. సైబర్ క్రైమ్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్!

వార్డులా.. వరండాలా?

Advertisement

రోగులకు కనీస ప్రైవసీ కూడా లేకుండా వార్డుల పేరుతో వరండాల్లో పడుకోబెడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వైద్యం కోసం వచ్చిన రోగులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యంపై ఉన్నప్పటికీ.. అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయంటూ రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రికార్డులు ఉన్నాయా? డ్యూటీ డాక్టర్లు ఎక్కడ?

ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యుల వివరాలు, డ్యూటీ రోస్టర్‌, కేస్‌షీట్లు, చికిత్స అందించిన వైద్యుల వివరాలు, సిబ్బంది అర్హతలు తదితర రికార్డులను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. బోర్డుపై ఉన్న వైద్యులే వాస్తవంగా రోగులను పరిశీలిస్తున్నారా? లేక వారి పేర్లను మాత్రమే ఉపయోగిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల తనిఖీలు ఎప్పుడు?

ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశంపై ఇన్ని ఆరోపణలు వెలువడుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి అనుమతులు, వైద్యుల అర్హతలు, సిబ్బంది వివరాలు, వసతులు, రికార్డులు, రోగులకు అందుతున్న చికిత్స తదితర అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తక్షణమే ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఆరోపణల్లో వాస్తవం ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు నిరాధారమైతే అధికారిక తనిఖీల ద్వారా స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.

Also read: అవార్డులు ప్రతిభకా.. లేక పరిచయాలకా.. ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో దారుణం!

Tags

Related News

గణేష్ నిమజ్జనంపై రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు, నిర్వాహకులకు సంచలన ఆదేశాలు!

మగవాళ్లే చీర కట్టుకుని అలాంటి దందాలు.. అదిలాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆవేదన!

అవార్డులు ప్రతిభకా.. లేక పరిచయాలకా.. ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో దారుణం!

కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

జీహెచ్ఎంసీలో ష్.. గప్ ‌చుప్ రూల్.. ఉన్నతాధికారుల సీక్రెట్ ఆంక్షలు!

ఇల్లు లేదా కొత్త ప్లాట్ కొంటున్నారా.. అయితే హైడ్రా మీకు గుడ్ న్యూస్!

1980s ఫోటో ట్రెండ్ వెనుక పెద్ద స్కామ్.. సైబర్ క్రైమ్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×