E-Paper
Advertisement

చెరువు కబ్జాకోసం రోడ్డుతో స్కెచ్.. కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు మౌనరాగంలో అధికారులు..?

చెరువు కబ్జాకోసం రోడ్డుతో స్కెచ్.. కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు మౌనరాగంలో అధికారులు..?
Advertisement

Illegal Expansion: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ పరిధిలోని రావల్‌కోల్ గ్రామం సర్వే నంబర్ 80లో ఉన్న నల్లవాని కుంట వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే కుంట పరిధిని ఆక్రమిస్తూ 40 అడుగుల వెడల్పుతో దారి నిర్మాణం చేపట్టడం స్థానికుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. కుంట పక్కన భారీ యంత్రాలతో ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి.

గ్రామస్తులు ఆందోళన

దశాబ్దాల నాటి చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తూ, కుంట పరిధిని తవ్వి రహదారి విస్తరణ చేపడుతున్నారు. దీనివల్ల సహజ నీటి ప్రవాహం దెబ్బతినే ప్రమాదం ఉందని, వర్షాకాలంలో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖకు చెందిన కుంటలో పనులు చేపట్టాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి. అలాగే చెట్ల నరికివేతకు అటవీ శాఖ అనుమతి అవసరం. అయితే ఈ రెండింటినీ పూర్తిగా విస్మరించి పనులు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయా? లేక నిర్లక్ష్యమే కారణమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Advertisement

Also Read: మహిళలే యజమానులు.. ప్రతి మండలానికి ఆర్టీసీ బస్సు.. జూన్ 2 నుంచి కొత్త ప్రయాణం!

అనుమానాలు వ్యక్తం..

కుంటను కబ్జా చేస్తూ దారి విస్తరణ చేపట్టడం వెనుక భూకబ్జాదారుల చేతి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టా భూములను భవిష్యత్తులో లేఅవుట్లకు అనుకూలంగా మార్చుకునేందుకు ముందస్తు చర్యలే చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికైనా ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పనులను నిలిపివేయాలని, కుంటలను రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: Office Misconduct: రైతు కార్యాలయంలో మందు పార్టీ రచ్చ రచ్చ.. బరితెగించిన ఉద్యోగులు

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×