E-Paper
Advertisement

మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!

మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!

Hospital Negligence: స్వేచ్ఛ బ్యూరో: ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రికే నిర్లక్ష్య జ్వరం పట్టుకుంది. మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ బుధవారం ఉదయం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన ఆస్పత్రి.. 10 గంటలు దాటినా తలుపులు మాత్రం తెరుచుకోలేదు. వైద్యం కోసం వచ్చిన రోగులు, టీకాల కోసం చిన్నారులను తీసుకొచ్చిన బాలింతలు గంటల తరబడి ఆస్పత్రి ఎదుటే పడిగాపులు కాశారు.

Also read: పోక్సో కేసులో కీలక పరిణామం.. పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. సాక్ష్యాలతో వస్తానంటూ..

మహిళలు అవస్థలు..

బుధవారం కావడంతో చిన్నారులకు వ్యాక్సినేషన్‌ కోసం ఒకరి వెంట ఒకరు తల్లులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే సిబ్బంది జాడ లేకపోవడంతో చంటి బిడ్డలను ఎత్తుకుని మహిళలు అవస్థలు పడ్డారు.“ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఇలానే ఉంటే పేదలు ఎక్కడికి వెళ్లాలి?” అంటూ ప్రజలు మండిపడ్డారు. గంటకు పైగా రోగులు, వైద్య సిబ్బంది ఎదురు చూస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.సమయపాలన పాటించని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also read: మంత్రి పదవి కంటే పీసీసీ చీఫ్ పదవిలోనే మస్తు మజా..?

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×