BigTV English
Advertisement

Minister Seethakka: మేడారంకు 1.35 కోట్ల మంది భక్తులు.. రూ.100 కోట్ల నిధులతో వసతులు..

Minister Seethakka: మేడారంకు 1.35 కోట్ల మంది భక్తులు.. రూ.100 కోట్ల నిధులతో వసతులు..

Minister Seethakka


Minister Seethakka: మేడారం జాతర విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని చెప్పారు. శనివారం మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మేడారంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించారు.

20శాఖల అధికారులు జాతర పనుల్లో కష్టపడి పని చేశారని మంత్రి సీతక్క అన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తమ వంతుగా కృషి చేశామన్నారు. జాతర కోసం ఆర్టీసీ దాదాపు 6వేల బస్సులను కేటాయించిందన్నారు. 12వేల ట్రిప్పులు నడిపిందని ఆమె వెల్లడించారు. మహాజాతరకు వచ్చిన భక్తుల్లో 5090మంది తప్పి పోయారని తెలిపారు. వారిలో 5062 మందిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఇంకా 32 మంది చిన్నారులు అధికారుల వద్ద జాగ్రత్తగా ఉన్నారన్నారు. వారిని వారి కుటుంబాలకు క్షేమంగా అప్పగిస్తామని తెలిపారు.


Read More:తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం.. స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా చిన్నారెడ్డి..

తప్పిపోయిన వారి వివరాల కోసం మీడియా పాయింట్, జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన మిస్సింగ్ పాయింట్ లో సంప్రదించాలని మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం సం నుంచి మేడారంలో పది రోజుల పాటు పారిశుద్ద్య పనులు జరుగుతాయని వెల్లడించారు. ఇందు కోసం దాదాపు 4 వేల మంది కార్మికులను నియమించినట్లు మంత్రి వెల్లడించారు.

 

Tags

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×