E-Paper
Advertisement

Thummala Nageswara Rao: “వరి వేస్తే ఉరి” అన్నోళ్లకు బోనస్ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? మంత్రి తుమ్మల ధ్వజం

Thummala Nageswara Rao: “వరి వేస్తే ఉరి” అన్నోళ్లకు బోనస్ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? మంత్రి తుమ్మల ధ్వజం
Advertisement

Thummala Nageswara Rao: ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ నాయకుల విమర్శలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా స్పందించారు. రైతు సంక్షేమంపై తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు పడ్డ ఇబ్బందులను ఆయన ఎండగట్టారు.

“వరి వేస్తే ఉరి” అని గతంలో రైతులను భయపెట్టిన బీఆర్ఎస్ నాయకులకు, నేడు వరి బోనస్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తుమ్మల విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ స్ఫూర్తితో, యూరియా పంపిణీలో పారదర్శకత కోసం ప్రయోగాత్మకంగా 5 జిల్లాల్లో ప్రవేశపెట్టిన యాప్ విజయవంతమైందని తుమ్మల వెల్లడించారు. ఇప్పటికే సుమారు లక్ష మందికి పైగా రైతులు ఈ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నారని తెలిపారు.

Advertisement

యాసంగి సీజన్‌కు అవసరమైన 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటికే 4.60 లక్షల టన్నులను పంపిణీ చేశామని, మిగిలిన కోటా కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 14,000కు పడిపోయినప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దానిని రూ. 20,000 వరకు పెంచగలిగిందని మంత్రి గుర్తుచేశారు. గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన వారు కూడా రైతులకు సౌకర్యంగా ఉండే యాప్‌పై అపోహలు సృష్టించడం హాస్యాస్పదమని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రూ. 1,05,000 కోట్లు ఖర్చు చేసిందని, రైతుబంధును రూ. 5000 నుండి రూ. 6000కి పెంచడమే కాకుండా రైతు భీమాను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీని ఏళ్ల తరబడి వాయిదా వేసి, వడ్డీల పేరుతో రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తన నైతికతను చాటుకుందని తెలిపారు.

Advertisement

సాగునీటి ప్రాజెక్టులైన సీతమ్మ బ్యారేజ్, సీతారామసాగర్‌లను పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 10 లక్షల ఎకరాలను పచ్చగా మారుస్తామని పునరుద్ఘాటించారు. తమది రైతు ప్రభుత్వమని ఇప్పటికే చేతల్లో నిరూపించుకున్నామని, పంట నష్ట పరిహారం కింద మొదటి ఏడాది రూ. 100 కోట్లు, రెండో ఏడాది రూ. 275 కోట్లు కేటాయించి రైతులకు అండగా నిలిచామని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Read Also:  టీటీడీ పాలకమండలి సభ్యుడు రాజీనామా.. అసలు కారణం ఇదేనా?

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×