E-Paper
Advertisement

Ration Dealers: రేషన్ షాపుల్లో సన్న బియ్యం, సబ్సిడీకి గోధుమలు

Ration Dealers: రేషన్ షాపుల్లో సన్న బియ్యం, సబ్సిడీకి గోధుమలు
Advertisement

Fine Rice: తెల్ల రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు. జనవరి నుంచి చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే.. సబ్సిడీకి గోధుమలను అందిస్తామని వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1629 రేషన్ డీలర్ల భర్తీ చేపడుతున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి, విధానాలనున తయారు చేయాలని, వీలైనంత త్వరగా భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.

పేదలు ఆహారం కోసం ఎన్నో కష్టాలు పడుతారని, వారికి సన్న బియ్యం అందించాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అదే సందర్భంలో డీలర్లకు వార్నింగ్ ఇచ్చారు. పీడీఎస్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడితే డీలర్షిప్ రద్దు చేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి మచ్చ తెస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. రేషన్ డీలర్ల ఆదాయం పెంపునకు ప్రణాళికలు వేస్తున్నామని, వారి న్యాయమైన కోర్కెలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని వివరించారు.

Advertisement

Also Read: Revanth Reddy: హస్తినలో సీఎం.. ఆరుగురికి మంత్రులుగా అవకాశం?

ప్రభుత్వ వసతి గృహలతోపాటు అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు విసురుతున్న తరుణంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×