E-Paper
Advertisement

Velugumatla land patta distribution: వెలుగుమట్ల బాధితులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రుల బృందం!

Velugumatla land patta distribution: వెలుగుమట్ల బాధితులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రుల బృందం!

Velugumatla land patta distribution: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం లభించింది. గుడిసెలు కోల్పోయిన పేద నిర్వాసితుల్లో అర్హులైన వారిని గుర్తించిన ప్రభుత్వం వారికి అదే చోట నివసించేలా హక్కు పత్రాలను పంపిణీ చేసింది. బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మొత్తం 412 మంది అర్హులకు పట్టాలు అందజేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రుల బృందం స్పష్టం చేసింది. వెలుగుమట్ల ప్రాంతంలో 311 మందికి స్థలంతో పాటు ఇల్లు ఇస్తుండగా మిగిలిన 101 మందికి వారి స్వస్థలాల్లోనే ఇంటి నిర్మాణానికి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెలుగుమట్ల పేదల వద్ద ఒక సమాంతర మాఫియా ముఠా చేరి వేల రూపాయలు దోచుకుందని మండిపడ్డారు. సరైన వసతులు కల్పించకుండా పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ మాఫియాను వెళ్లగొట్టేందుకే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేపే వెలుగుమట్లలో భూమి పూజ నిర్వహిస్తామని.. డిసెంబర్ 9వ తేదీ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని బాధితులు పాల పొంగించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బాధితులు ఎటువంటి భయం లేకుండా ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ కమిట్ మెంట్ అని పునరుద్ఘాటించారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పేదల ఇళ్లపై చిత్తశుద్ధి లేని వారు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఏడున్నరేళ్లుగా ఇక్కడ ఉంటున్న పేదలకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. ఇది పేదోడి ప్రభుత్వమని.. ఇక్కడ నివాసాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, మౌలిక వసతులు కూడా ప్రభుత్వం కట్టిస్తుందని హామీ ఇచ్చారు. పేదవాడి సొమ్మును దోచుకున్న వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వెలుగుమట్లలో ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారికి కూడా తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక ముఠాగా ఏర్పడి పేదల రెక్కల కష్టాన్ని దోచుకున్న దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ భూమి ప్రస్తుతం సీసీఎల్ పరిధిలోకి వచ్చిందని.. అందుకే అర్హులను గుర్తించి నేరుగా ప్రభుత్వం ద్వారా ఇళ్లు అందజేస్తున్నామని తెలిపారు. వెలుగుమట్ల కాలనీలో పేద పిల్లల చదువు కోసం మోడల్ స్కూల్, కమ్యూనిటీ హాల్ వంటి వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కాలనీని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్ది పేదల కుటుంబాల్లో సంతోషం నింపుతామని ఆయన ప్రకటించారు. మాఫియా శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని బాధితులకు సూచించారు.

Read Also: Water Pollution: బంధం కుంట చెరువులో డేంజర్ బెల్స్.. ఇరిగేషన్, మున్సిపల్ శాఖపై స్థానికులు ఆగ్రహం

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×