MLA Rajesh Reddy: స్వేచ్ఛ బ్యూరో: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో తను చేసే పనులకు నూతన పాలకవర్గం క్రియాశీలకంగా సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(MLA Rajesh Reddy) కోరారు. మున్సిపల్ నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా తీగల సునేంద్ర కుమార్, బాదం రమేశ్ తో పాటు నూతన పాలకవర్గం బాధ్యతలను స్వీకరించింది. దీంతో హిందూ, మైనారిటీ, క్రిస్టియన్ మత పెద్దల ఆశీర్వదించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడారు.
Also Read: Telangana: తెలంగాణలో మార్చి 1 నుంచి జేబులకు చిల్లు.. మేటరేంటంటే?
నాగర్ కర్నూల్ పట్టణ అభివృద్ధికి కొత్త పాలకవర్గం సమన్వయంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, శుభ్రత, తాగునీరు, రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు పాలకవర్గం కృషి చేయాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహకారంతో కోట్లాది రూపాయలు మంజూరు అయ్యాయని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పరిపాలన అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ రమణ రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.
Also Read: Epstein Files: బికినీ అమ్మాయిలు.. చేతిలో మద్యం.. స్టీఫెన్ హాకింగ్ ఫొటో కలకలం