E-Paper
Advertisement

Kishan Reddy, Bandi in Union Cabinet: మోడీ క్యాబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికీ అవకాశం.. మరి శాఖల మాటేంటి..?

Kishan Reddy, Bandi in Union Cabinet: మోడీ క్యాబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికీ అవకాశం.. మరి శాఖల మాటేంటి..?
Advertisement

Kishan, Bandi Sanjay are in Union Cabinet from Telangana: ప్రధాని నరేంద్రమోడీ కొత్త కేబినెట్‌లో చాలామంది సీనియర్లను పక్కన బెట్టారు. కొత్తగా కొంతమందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. త్వరలో బీహార్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు పెద్ద పీఠ వేసినట్టు కనిపిస్తోంది.

తెలంగాణ నుంచి ఈసారి సీనియర్ నేతలకు అదృష్టం వరించింది. ఒకరు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాగా, మరొకరు బండి సంజయ్. చాలామంది సీనియర్లను పక్కన పెట్టిన బీజేపీ హైకమాండ్, పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. గతంలో మాట ఇచ్చిన ప్రకారం బండి సంజయ్‌ని కొత్తగా కేబినెట్‌లోకి తీసుకొచ్చారు.

Advertisement

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి  తీసుకున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి ఎలాంటి శాఖలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కిషన్‌రెడ్డి ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చారని తెలంగాణ కమలం పార్టీ నేతలు నొచ్చుకున్నారు. ఈసారి ఇద్దర్ని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఎలాంటి శాఖలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: మోదీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్తారా? లేకపోతే..

Advertisement

అంతేకాదు ఏపీలోని ఇద్దరు టీడీపీ ఎంపీలతోపాటు ఓ బీజేపీ నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకునే శాఖలు ఇస్తారా? బొగ్గు, విద్యుత్ వంటి శాఖలతో మమ అనిపిస్తారా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

ఇప్పుడేకాదు.. ఉమ్మడి ఏపీలో కూడా పెద్దగా ప్రయార్టీ లేని శాఖలు కేంద్రంలోని కొలువుదీరిన ప్రభుత్వాలు ఇచ్చేవి. మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు ఏపీతోపాటు తెలంగాణలు కీలకపాత్ర పోషించాయి. అంతేకాదు ఏకంగా 29 మంది ఎంపీలు గెలిచారు. మరి నేతలు చెప్పుకోవడానికి బలమైన శాఖలు ఇస్తారా? లేదా అన్నది కొద్దిగంటల్లో తేలిపోనుంది.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×