E-Paper
Advertisement

Moinabad Farm House Case : ఆ ముగ్గురిపై కేసులివే

Moinabad Farm House Case : ఆ ముగ్గురిపై కేసులివే
Advertisement

Moinabad Farm House Case : తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు ముడుపుల ఇవ్వజూపిన వ్యవహారంలో ఆ ముగ్గురి నిందితులపై 120 B,171 B,రెడ్ విత్ 171 E,506,రెడ్ విత్ ఐపీసీ 34, యాక్ట్ సెక్షన్ 8 కింద కేసులు నమోదు చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎప్పటి నుంచి సంప్రదింపులు జరిపారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. మొయినాబాద్ ఫాంహౌస్ లోని సీసీటీవీ ఫుటీజీని పరిశీలిస్తున్నారు.

ఎఫ్ఐఆర్ లో ఉన్న కీలకాంశాలు ఇవే

Advertisement

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. బీజేపీలో చేరితే రూ. 100 కోట్లు ఇప్పిస్తామని రామచంద్ర భారతి ఆఫర్ చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే ఆ డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారని రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని మధ్యవర్తులు ఆఫర్ చేసినట్లు తెలిపారు. తనతోపాటు బీజేపీలో చేరే వారికి రూ. 50 కోట్లు ఆఫర్ చేశారని రోహిత్ రెడ్డి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రామచంద్ర భారతి, నందకుమార్ బీజేపీకి చెందిన వ్యక్తులుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రోహిత్ రెడ్డి వివరించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలనే ఎఫ్ఐఆర్ లో పొందుపర్చారు పోలీసులు. ఇప్పుడు ఇదే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేయాలనే కుట్ర వెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే విషయంపై దృష్టి పెట్టారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×