E-Paper
Advertisement

Hydraa: బరితెగించిన కబ్జా కోరులు.. కాలనీ రోడ్లన్నీ మాయం..?

Hydraa: బరితెగించిన కబ్జా కోరులు.. కాలనీ రోడ్లన్నీ మాయం..?
Advertisement

Hydraa: స్వేచ్ఛ బ్యూరో:  కాల‌నీల్లోని రోడ్లను సైతం వదలటం లేదు. అక్రమార్కులు వాటిని కూడాు క‌బ్జా చేసేస్తున్నారు. డెడ్ ఎండ్ కాల‌నీ రోడ్డుంటే, ఇరువైపులా ప్లాట్లున్న‌వారు ఆ దారినే మూసేస్తున్నారు. కొత్త‌గా ప‌క్క‌న లే ఔట్‌లు వేసిన వారు, ఇప్ప‌టికే ఉన్న వ‌ర‌ద‌, మురుగు కాలువ‌ల‌కు ఆటంకాలు సృష్టిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబ‌ర్‌పేట్ మండ‌లం కుంట్లూరు విలేజ్ స‌ర్వే నెంబ‌రు 204లో దాదాపు 15 ఎక‌రాల మేర 800ల ప్లాట్ల‌తో అంజానాద్రిన‌గ‌ర్ పేరిట లే ఔట్ వేశారు. ప‌క్క‌నే లే ఔట్ వేసిన వారు త‌మ లే ఔట్లోకి జ‌రిగి ర‌హ‌దారితో పాటు కొన్ని ప్లాట్లు మాయం చేశారంటూ అంజ‌నాద్రి ప్లాట్ య‌జ‌మానులు ఫిర్యాదు చేశారు.

మ‌హ‌ల‌క్ష్మీన‌గ‌ర్ కాల‌నీ..

తుర్క‌యాంజ‌ల్ నాగార్జున సాగ‌ర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న మ‌న్నెగూడ విలేజ్‌లో 30 పీట్ల ర‌హ‌దారిని ఆక్ర‌మించార‌ని, రోడ్డు మీద ట్రాన్స్‌ఫార్మ‌ర్‌, గుడికి చెందిన ప్ర‌హ‌రీ నిర్మించార‌ని ప్ర‌జావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌మ ప్లాట్ల‌కు ఎల్ ఆర్ ఎస్ కూడా వ‌చ్చింద‌ని, అందులో రోడ్డు కూడా ఉంద‌ని, ఇప్పుడు కావాలంటే రోడ్డును కొనుక్కోవాల‌ని అక్క‌డివారు చెబుతున్నార‌ని ఫిర్యాదులో తెలిపారు. హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌లం వ‌న‌స్థ‌లి పురం సాహేబ్‌న‌గ‌ర్ క‌లాన్‌లోని మ‌హ‌ల‌క్ష్మీన‌గ‌ర్ కాల‌నీ ప‌క్క‌న క‌మ‌ర్షియ‌ల్ లేఔట్ వేసిన వారు మురుగుతో పాటు వ‌ర‌ద కాలువను మూసేయ‌డంతో త‌మ ప్రాంతం నీట మునుగుతోంద‌ని ఫిర్యాదు చేశారు.

Advertisement

Also Read: సర్కారు బడికి కార్పొరేట్ కష్టాలు.. నిబంధన ఉచ్చులో 11 స్కూళ్లు..!

సెంట్ర‌ల్ పార్కులో..

ప‌టాన్‌చెరులోని జీఎంఆర్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ప‌క్క‌న ప్ర‌వీన్స్ ల‌గ్జారియాలో సెంట్ర‌ల్ పార్కులో ఆల‌యాల పేరిట క‌బ్జా చేస్తున్నార‌ని, వెంట‌నే నిలువ‌రించాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో వాపోయారు. నాచారం- మల్లాపూర్ ప్ర‌ధాన ర‌హ‌దారిలో ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని, రోడ్డు మీద‌కు వ‌చ్చి నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని, రాజేంద్ర‌న‌గ‌ర్ జోన్ అత్తాపూర్ స‌ర్కిల్‌, మైలార్‌దేవుప‌ల్లిలోని టీఎన్‌జీవో కాల‌నీలో 1200 గ‌జాల పార్కును క‌బ్జా చేశార‌ని ఫిర్యాదులందాయి. ఇదే కాల‌నీలో 40 ఫీట్ల ర‌హ‌దారిని కూడా క‌బ్జా చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ గ్రామంలో ప‌త్తికుంట‌కు వెళ్లే వ‌ర‌ద కాలువ‌ను క‌బ్జా చేస్తున్నార‌ని వచ్చిన ఫిర్యాదుతో పాటు హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 58 ఫిర్యాదులందినట్లు, వాటిని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించి సత్వర ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

Advertisement

Also Read: స్వేచ్ఛ ఎఫెక్ట్.. టూరిజంలో పారదర్శకత పెంపునకు కృషి!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×