E-Paper
Advertisement

Hydraa: బరితెగించిన కబ్జా కోరులు.. కాలనీ రోడ్లన్నీ మాయం..?

Hydraa: బరితెగించిన కబ్జా కోరులు.. కాలనీ రోడ్లన్నీ మాయం..?

Hydraa: స్వేచ్ఛ బ్యూరో:  కాల‌నీల్లోని రోడ్లను సైతం వదలటం లేదు. అక్రమార్కులు వాటిని కూడాు క‌బ్జా చేసేస్తున్నారు. డెడ్ ఎండ్ కాల‌నీ రోడ్డుంటే, ఇరువైపులా ప్లాట్లున్న‌వారు ఆ దారినే మూసేస్తున్నారు. కొత్త‌గా ప‌క్క‌న లే ఔట్‌లు వేసిన వారు, ఇప్ప‌టికే ఉన్న వ‌ర‌ద‌, మురుగు కాలువ‌ల‌కు ఆటంకాలు సృష్టిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబ‌ర్‌పేట్ మండ‌లం కుంట్లూరు విలేజ్ స‌ర్వే నెంబ‌రు 204లో దాదాపు 15 ఎక‌రాల మేర 800ల ప్లాట్ల‌తో అంజానాద్రిన‌గ‌ర్ పేరిట లే ఔట్ వేశారు. ప‌క్క‌నే లే ఔట్ వేసిన వారు త‌మ లే ఔట్లోకి జ‌రిగి ర‌హ‌దారితో పాటు కొన్ని ప్లాట్లు మాయం చేశారంటూ అంజ‌నాద్రి ప్లాట్ య‌జ‌మానులు ఫిర్యాదు చేశారు.

మ‌హ‌ల‌క్ష్మీన‌గ‌ర్ కాల‌నీ..

తుర్క‌యాంజ‌ల్ నాగార్జున సాగ‌ర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న మ‌న్నెగూడ విలేజ్‌లో 30 పీట్ల ర‌హ‌దారిని ఆక్ర‌మించార‌ని, రోడ్డు మీద ట్రాన్స్‌ఫార్మ‌ర్‌, గుడికి చెందిన ప్ర‌హ‌రీ నిర్మించార‌ని ప్ర‌జావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌మ ప్లాట్ల‌కు ఎల్ ఆర్ ఎస్ కూడా వ‌చ్చింద‌ని, అందులో రోడ్డు కూడా ఉంద‌ని, ఇప్పుడు కావాలంటే రోడ్డును కొనుక్కోవాల‌ని అక్క‌డివారు చెబుతున్నార‌ని ఫిర్యాదులో తెలిపారు. హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌లం వ‌న‌స్థ‌లి పురం సాహేబ్‌న‌గ‌ర్ క‌లాన్‌లోని మ‌హ‌ల‌క్ష్మీన‌గ‌ర్ కాల‌నీ ప‌క్క‌న క‌మ‌ర్షియ‌ల్ లేఔట్ వేసిన వారు మురుగుతో పాటు వ‌ర‌ద కాలువను మూసేయ‌డంతో త‌మ ప్రాంతం నీట మునుగుతోంద‌ని ఫిర్యాదు చేశారు.

Also Read: సర్కారు బడికి కార్పొరేట్ కష్టాలు.. నిబంధన ఉచ్చులో 11 స్కూళ్లు..!

సెంట్ర‌ల్ పార్కులో..

ప‌టాన్‌చెరులోని జీఎంఆర్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ప‌క్క‌న ప్ర‌వీన్స్ ల‌గ్జారియాలో సెంట్ర‌ల్ పార్కులో ఆల‌యాల పేరిట క‌బ్జా చేస్తున్నార‌ని, వెంట‌నే నిలువ‌రించాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో వాపోయారు. నాచారం- మల్లాపూర్ ప్ర‌ధాన ర‌హ‌దారిలో ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని, రోడ్డు మీద‌కు వ‌చ్చి నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని, రాజేంద్ర‌న‌గ‌ర్ జోన్ అత్తాపూర్ స‌ర్కిల్‌, మైలార్‌దేవుప‌ల్లిలోని టీఎన్‌జీవో కాల‌నీలో 1200 గ‌జాల పార్కును క‌బ్జా చేశార‌ని ఫిర్యాదులందాయి. ఇదే కాల‌నీలో 40 ఫీట్ల ర‌హ‌దారిని కూడా క‌బ్జా చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ గ్రామంలో ప‌త్తికుంట‌కు వెళ్లే వ‌ర‌ద కాలువ‌ను క‌బ్జా చేస్తున్నార‌ని వచ్చిన ఫిర్యాదుతో పాటు హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 58 ఫిర్యాదులందినట్లు, వాటిని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించి సత్వర ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

Also Read: స్వేచ్ఛ ఎఫెక్ట్.. టూరిజంలో పారదర్శకత పెంపునకు కృషి!

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×