Hotel Inspections: మేడ్చల్ స్వేచ్ఛ: ప్రజాపాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కపల్లి వార్డులో హోటళ్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పాటించని రెండు హోటళ్లకు తుర్కపల్లిలో, ఒక హోటల్కు మజీద్పూర్లో కలిపి మొత్తం రూ.30 వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్ల యజమానులు తప్పనిసరిగా పరిశుభ్రత నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాల తయారీ, నిల్వ విషయంలో శుభ్రత పాటించాలని ఆయన తెలిపారు.
Also Read: Basil Seeds: ఒంటి వేడిని తగ్గించే నేచురల్ కూలర్.. ఎండాకాలం సబ్జా గింజలు తింటే బోలెడు బెనిఫిట్స్
అలాగే తండా ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టారు.ఈకార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు ఇన్చార్జి మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్చార్జి ఆర్ఓ వేణుగోపాల్, ఇన్చార్జి ఆర్ఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.