BigTV English
Advertisement

Nizam Sagar Bridge: రూ.25 కోట్లు ఖర్చుపెట్టారు.. సంవత్సరం తిరగకుండానే కుంగిపోయిన బ్రిడ్జి

Nizam Sagar Bridge: రూ.25 కోట్లు ఖర్చుపెట్టారు.. సంవత్సరం తిరగకుండానే కుంగిపోయిన బ్రిడ్జి

Nizam Sagar Bridge built on Manjeera river sagged in Kamareddy district: ఒకప్పుడు బ్రిడ్జిల నిర్మానం ఎంతో పటిష్టవంతంగా ఉండేది. నూరేళ్లయినా అవి ఉపయోగంలోనే ఉండేవి. అయితే ప్రస్తుత ఇంజనీర్లు కట్టించే బ్రిడ్జీలు సంవత్సరం తిరగకుండానే కుంగిపోతున్నాయి. కొన్ని చోట్ల కూలిపోతున్నాయి. కొద్ది పాటి వరద ప్రవాహానికే తట్టుకోలేక పోతున్నాయి. ఎక్కడైనా రోడ్డు రవాణాన వ్యవస్థ బాగుంటేనే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇన్నాళ్లుగా సరైన బ్రిడ్జీలు లేక, రవాణా సదుపాయాలు లేక చాలా వరకూ గ్రామాలు కుగ్రామాలుగా మిగిలిపోయాయి. అయితే ఎప్పుడో నిజాం ప్రభువుల కాలంలో నిర్మించిన నిజాం సాగర్ వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నిజాంసాగర్ మంజీరా నదిపై నిజాం సాగర్ మండల కేంద్రంలో ఓ బ్రిడ్జి నూతనంగా నిర్మించారు. 2025 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ఎంతో వ్యవప్రయాసల కూర్చి రూ.25 కోట్లు ఈ ప్రాజెక్ట పై వెచ్చించింది. ఈ వంతెన నిర్మాణం మొదలుపెట్టి 8 సంవత్సరాలయింది.


కేటీఆర్ ప్రారంభించిన బ్రిడ్జి

2023 సంవత్సరంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా ఈ వంతెనను ప్రారంభించారు. అయితే నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేసిన ఇంజనీర్లు అప్పటి అధికార్లతో కుమ్మక్కై నాసిరకంగా బ్రిడ్జి నిర్మించారు. మొన్న మార్చి నాటికి సంవత్సరం పూర్తిచేసుకుంది నిజాంసాగర్ బ్రిడ్జి. సంవత్సర కాలానికే బ్రిడ్జి పై గుంతలు ఏర్పడ్డాయి. మధ్య మధ్యలో పగుళ్లు కూడా కనిపిస్తున్నాయి. దానితో అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్లకు నోటీసులు కూడా జారీ చేశారు. ఏదో పైపై పనులు పూర్తి చేసి చేతులు దులుపుకున్నాడు కాంట్రాక్టర్. అయినా వంతెన కుంగిపోయినట్లుగా కనిపించడంతో దానిపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు భయపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షం తాకిడికి వంతెన అడుగున రెండు నుంచి మూడు ఇంచులు ఒక్కసారిగా కుంగిపోయింది. ఇకపై వర్షాలుకురిస్తే బ్రిడ్జి మరింతగా కుంగిపోయే ప్రమాదం ఉందని.. ఇప్పటికైనా బ్రిడ్జికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజలు ఆర్ అండ్ బీ అధికారులకు విన్నవించుకుంటున్నారు.


Related News

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Hyderabad: జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ హత్య కేసులో 24 గంటల్లోనే వీడిన మిస్టరీ!

Bandi Sanjay: బోరబండ రోడ్ షో రగడ.. పోలీసులు ఎంఐఎం తొత్తులా?, బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×