E-Paper
Advertisement

Nizamabad district: పోలీసు యూనిఫాం లో వడ్డీ మాఫియా? నిజామాబాద్‌లో షాక్‌!

Nizamabad district: పోలీసు యూనిఫాం లో వడ్డీ మాఫియా? నిజామాబాద్‌లో షాక్‌!

Nizamabad district: నిజామాబాద్ జిల్లాలో కొందరు పోలీసులే ప్రజలను భయపెడుతున్న వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. శాంతి భద్రతల కోసం పని చేయాల్సిన రక్షక భటులే కొన్ని చోట్ల భయపెట్టే వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. వడ్డీ వ్యాపారం, అధిక వడ్డీకి డబ్బులిచ్చి ప్రజలను వేధించే చర్యలు పలు ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన ఒక ఘటన ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రియదర్శినీ కాలనీలో నివాసముండే గంగాధర్ అనే కానిస్టేబుల్‌ మెండోరా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతను గత కొన్ని సంవత్సరాలుగా ఓ వడ్డీ వ్యాపారిగా మారిపోయి, ప్రజలకు అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి, తిరిగి వసూలు చేయడం మామూలే కాకుండా, భూములు, ఆస్తులను సేల్ డీడ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చాడు.

అతని వడ్డీ బిజినెస్ ఒక మహిళ ఫిర్యాదుతో బహిర్గతమయ్యాయి. బాధితురాలికి రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చిన గంగాధర్‌ తన దగ్గర నుండి బలవంతంగా 3 స్థలాలపై సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని పేర్కొంటూ నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన రూరల్ స్టేషన్ ఎస్ఐ ఆరిఫ్ కేసు నమోదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు.

ఈ ఘటనపై ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. పోలీసులు ఒకవైపు వడ్డీ వ్యాపారులపై దాడులు చేస్తుంటే, మరొకవైపు తాము ఆ పనిలో పాల్గొనడం గమనార్హం. పోలీసులే ప్రజల భద్రతను కాపాడాల్సిన బాధ్యత కలవారు. అలాంటి వారు చట్టాన్ని ఉల్లంఘించి, ప్రజలను భయపెట్టి ఆస్తులు కబళించేందుకు పోతే ఇక ప్రజలు న్యాయాన్ని ఎక్కడ ఆశించాలి?

జిల్లాలోని పోలీస్ ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటికే వడ్డీ వ్యాపారులపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ప్రాంతాల్లో వడ్డీ మాఫియాలపై దాడులు జరిపించారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఓ కానిస్టేబుల్ పై కేసు నమోదు కావడం చూస్తే, పోలీసుల చర్యలను మరింత గౌరవప్రదంగా మార్చింది.

ఇలాంటి కేసులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి, సామాన్యులపై ఒత్తిడి తేవడం, వారిని భూములు, ఆస్తుల విషయంలో నష్టపెట్టడం ఓ తీవ్రమైన నేరం. దీనిపై కఠిన చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సదరు పోలీస్ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేసి, పూర్తి విచారణ జరిపి శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.

నిజామాబాద్ వాస్తవంగా శాంతియుత ప్రాంతం. కానీ ఇటువంటి ఘటనలు ప్రజల నమ్మకాన్ని చూరగొన్న పోలీసు వ్యవస్థ పట్ల ఆశ్చర్యాన్ని, అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఒకవైపు ప్రభుత్వం వడ్డీ మాఫియాలపై కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకుంటుంటే, ప్రభుత్వమే నియమించిన పోలీసు ఉద్యోగులు ప్రజలను మోసం చేస్తే ఎలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.’

Also Read: Indira Soura Giri Jala Vikasam: రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు..

ఈ నేపథ్యంలో ప్రజల్లో నిర్భయంగా పోలీసులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడాలంటే, ఈ వ్యవహారాన్ని పారదర్శకంగా విచారించి, నేరాన్ని చేసినవారిని కఠినంగా శిక్షించాలి. అప్పుడే చట్టపరమైన పరిపాలన పట్ల ప్రజల్లో గౌరవం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థలో అంతర్గత పర్యవేక్షణను మరింత కఠినంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రతి పోలీసు స్థాయిలో అధికారులు వారి సిబ్బందిపై నిఘా పెట్టి, ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలి.

ఇలా వడ్డీ వ్యాపారుల ముసుగులో పనిచేస్తున్న వారిని వెలికితీసి, న్యాయాన్ని నిలబెట్టినప్పుడే ప్రజలు భద్రంగా ఉంటారని, అప్పుడే పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుందని స్థానికులు అంటున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే, ఇలాంటి ఘటనలపై నిష్పక్షపాతంగా వ్యవహరించడమే మార్గం. మొత్తం మీద సదరు కానిస్టేబుల్ పై పోలీసులు కేసు నమోదు చేయడం చూస్తే, నిజామాబాద్ పోలీసుల పారదర్శకతకు నిదర్శనమని చెప్పవచ్చు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×