Flyover Delay: తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని మాధవనగర్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. అయితే నిర్మాణ పనులు నిదానంగా జరుగుతుండంతో పనుల ఆలస్యం పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. ప్రాజెక్టును తొందరగా పూర్తిచేయండి అంటూ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని స్థానిక నాయకులను టార్గెట్ చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాధవనగర్ రైల్వే గేట్ పడటం వల్ల నిజామాబాద్, హైదరాబాద్ మార్గాల మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదరవు తున్నాయని ఫైర్ అయ్యారు. నిజామాబాద్ నుండి హైదరాబాద్కి ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రాధానంగా అటువైపుగా ప్రజలు అత్యవసర వైద్యం కోసం ప్రయాణించే ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. అత్యవరంగా వెల్లేటప్పుడు రైల్వే గేట్ పడిన సమయంలో అంబులెన్స్లు గంటల తరబడి నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని తెలిపారు.
Also read: కరెంట్ షాక్ ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి? ప్రాణాలు కాపాడేందుకు తీసుకోవాల్సిన 4 జాగ్రత్తలు
దీంతో సరైన సమయానికి ఆసుపత్రికి చేరలేక ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మరనాలకు ప్రభుత్వమే భాద్యత వహించాలని ఎంపీ అరవింద్ అన్నారు. ఈ ప్రాజెక్టులో కొంత భాగం కేంద్ర ప్రభుత్వ వాటా మిగిలిన వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. దీంతో కేవలం కమీషన్లకోసం ఆశపడి పనులను నిధానంగా, చేయడం దారుణం అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఫ్లైఓవర్ ని పూర్తిచేయాలని ఎంపీ అరవింద్ తెలిపారు.
మాధవనగర్ ఫ్లైఓవర్ పూర్తి చేయండి: ఎంపీ అర్వింద్
నిజామాబాద్ మాధవనగర్ ఫ్లైఓవర్ ఆలస్యంపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే గేట్ వల్ల అంబులెన్స్లలో ప్రాణాలు పోతున్నాయని, కమిషన్లు ఆపి వెంటనే పనులు పూర్తి చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలను… pic.twitter.com/4BXC5a8bsA
— BIG TV Breaking News (@bigtvtelugu) June 20, 2026
Also read: District Review: తెలంగాణలో ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ టాస్క్..?