Nizamabad News: నిజామాబాద్ లో ఓ వ్యక్తి తన భార్య మోసం చేసిందని ధర్నాకు దిగాడు. పెళ్లైన నాలుగు నెలల్లోనే భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపణ చేస్తున్నాడు భర్త ప్రశాంత్. బావ వరుసైన లింబాద్రి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని.. అతడి ఇంటి ఎదుట బైఠాయించాడు బాధితుడు. తనకు న్యాయం చేయాలంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని ఆందోళనకు దిగాడు. తన భార్యతో లింబాద్రితో చేసిన చాటింగ్ లు ఇతర ఆధారాలు చూపించినా పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆగస్ట్ 13న ప్రశాంత్ వివాహం కాగా.. పెళ్లిన నాలుగు నెలలకే భార్య వెళ్లిపోయింది. గత కొంత కాలంగా తన భార్య తనను మోసం చేసిందని వాట్సాప్ స్టేటస్ లు పెట్టుకుంటున్న బాధితుడు.. తాజాగా లింబాద్రి ఇంటి ముందు ధర్నాకు దిగాడు.
Also Read: School Bus Accident: శంషాబాద్ సమీపంలో ఘోర ప్రమాదం.. పాఠశాల బస్సు బోల్తా.. స్పాట్లో 60 మంది
ప్రశాంత్కు, సంయుక్త అనే మహిళతో ఈ ఏడాది ఆగస్టు 13న వివాహమైంది. కొన్ని నెలలు బాగానే సాగిన తర్వాత.. భార్య ప్రవర్తనలో మార్పును గమనించాడు ప్రశాంత్. భార్య ప్రవర్తనపై అనుమానంతో… ఫోన్ ను పరిశీలించగా బావ వరుసైన లింబాద్రి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలిసింది. పెళ్లికి ముందు నుంచి వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగుతోందని ప్రశాంత్ గుర్తించాడు. వారిద్దరి మధ్య జరిగిన అసభ్యకరమైన వాట్సాప్ చాటింగ్లు, ఫొటోలను చూసి ప్రశాంత్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయంపై భార్యను నిలదీసినట్లు తెలుస్తోంది. అలాగే వాట్సాప్ చాటింగ్ లను సాక్ష్యంగా తన వద్ద పెట్టుకున్నాడు.
తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేయాలని భార్య బావ ఇంటి ముందు ధర్నాకు దిగాడు. భార్య సంయుక్త, ఆమె బావ లింబాద్రి ఫొటోలతో ఉన్న ఓ ఫ్లెక్సీ తయారు చేయించి… ఆ ఫ్లెక్సీని తీసుకుని నేరుగా లింబాద్రి ఇంటి ముందు ధర్నా చేశాడు. భార్య తనను మోసం చేసిందని, వీరిద్దరి వల్ల తన జీవితం నాశనమైందని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. భార్య, తన బావతో చేసి వాట్సాప్ చాటింగ్ లను కొంతకాలంగా వాట్సాప్ స్టేటస్లు కూడా పెట్టుకుంటున్నాడు. తన భార్య మోసాన్ని ఎండగడుతూ పోస్టులు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే గత్యంతరం లేక ధర్నాకు దిగినట్లు బాధితుడు ప్రశాంత్ చెబుతున్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సంయుక్త తరపు బంధువులు ప్రశాంత్ ప్రదర్శిస్తున్న ఫ్లెక్సీని లాగేసుకుని, అతడిని అక్కడ్నుంచి పంపినట్లు తెలుస్తోంది.