E-Paper
Advertisement

DGP Shivadhar Reddy: మీ ఆరోపణలలో అనువంత కూడా నిజం లేదు: డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivadhar Reddy: మీ ఆరోపణలలో అనువంత కూడా నిజం లేదు: డీజీపీ శివధర్ రెడ్డి
Advertisement

DGP Shivadhar Reddy: ఫోరెన్సిక్​ సైన్స్​ లేబోరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్​)లో జరిగిన అగ్నిప్రమాదంలో పోలీసు శాఖను బద్నాం చేయటానికి కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ఓటుకు నోటు…ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో సాక్ష్యాధారాలు నష్టపోలేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పోరేషన్ల ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన చర్యల గురించి వివరించటానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఫోన్​ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నూటా ముప్పయికి పైగా ఆబ్జెక్ట్ మెటీరియల్స్ ఎఫ్ఎస్​ఎల్ కు అందాయన్నారు. వీటిలో సింహభాగం ఆబ్జెక్ట్​ మెటీరియల్స్ ను విశ్లేషించి డేటాను ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్టు తెలిపారు.

Also Read: Deefake AI Content: డీప్‌ఫేక్ ఏఐ కంటెంట్‌పై కేంద్రం సీరియస్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వెంటనే తొలగించాలి..

ఓటుకు నోటు కేసు..

Advertisement

ఏడు ఆబ్జెక్ట్ మెటీరియల్స్ కు సంబంధించి కొంతమేర నష్టం జరిగిందన్నారు. వీటికి సంబంధించిన డేటాను రికవరీ చేయటానికి నిపుణులు పని చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ఎఫ్ఎస్​ఎల్ నుంచి ఓ ప్రతినిధితోపాటు పూణె నుంచి వచ్చిన నిపుణులు ఈ పని మీద ఉన్నారన్నారు. డేటా రికవరీతోపాటు అసలు అగ్నిప్రమాదం ఎలా సంభవించింది అన్న దానిపై కూడా విచారణ చేస్తున్నట్టు తెలియచేశారు. ఎఫ్ఎస్​ఎల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలాంటి డేటా పోలీసులు.. అంతా సేవ్ చేసి ఉందన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎఫ్​ఎస్​ఎల్ కు పంపించిన అన్ని ఆధారాలు ప్రస్తుతం కోర్టు ఆధీనంలో ఉన్నట్టుగా చెప్పారు. నష్టపోయిన డేటాను సర్వర్ల నుంచి రికవరీ చేయటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

Also Read: Tollywood: మరో కొరియోగ్రాఫర్ దర్శకుడిగా.. ఎవరో తెలుసా?

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×