DGP Shivadhar Reddy: ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో జరిగిన అగ్నిప్రమాదంలో పోలీసు శాఖను బద్నాం చేయటానికి కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ఓటుకు నోటు…ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో సాక్ష్యాధారాలు నష్టపోలేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన చర్యల గురించి వివరించటానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నూటా ముప్పయికి పైగా ఆబ్జెక్ట్ మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్ కు అందాయన్నారు. వీటిలో సింహభాగం ఆబ్జెక్ట్ మెటీరియల్స్ ను విశ్లేషించి డేటాను ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్టు తెలిపారు.
ఏడు ఆబ్జెక్ట్ మెటీరియల్స్ కు సంబంధించి కొంతమేర నష్టం జరిగిందన్నారు. వీటికి సంబంధించిన డేటాను రికవరీ చేయటానికి నిపుణులు పని చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ఎఫ్ఎస్ఎల్ నుంచి ఓ ప్రతినిధితోపాటు పూణె నుంచి వచ్చిన నిపుణులు ఈ పని మీద ఉన్నారన్నారు. డేటా రికవరీతోపాటు అసలు అగ్నిప్రమాదం ఎలా సంభవించింది అన్న దానిపై కూడా విచారణ చేస్తున్నట్టు తెలియచేశారు. ఎఫ్ఎస్ఎల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలాంటి డేటా పోలీసులు.. అంతా సేవ్ చేసి ఉందన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ కు పంపించిన అన్ని ఆధారాలు ప్రస్తుతం కోర్టు ఆధీనంలో ఉన్నట్టుగా చెప్పారు. నష్టపోయిన డేటాను సర్వర్ల నుంచి రికవరీ చేయటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
Also Read: Tollywood: మరో కొరియోగ్రాఫర్ దర్శకుడిగా.. ఎవరో తెలుసా?