BigTV English

RangaReddy : తాగుడుకు బానిసైన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి..

RangaReddy : తాగుడుకు బానిసైన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి..

RangaReddy : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో జరిగింది. స్థానిక సీఐ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. జి సుగుణ అనే మహిళ కొడుకుతో కలిసి కేశంపేట రోడ్డులో గల ఇంట్లో జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో తాగుడుకు బానిస అయింది. కొడుకుతో గొడవపడి మరీ డబ్బులు తీసుకుని మద్యం సేవిస్తుండేది.


ఈ క్రమంలో 20 రూపాయల కోసం కొడుకుతో గొడవపడింది. అతను చేయి చేసుకోవడంతో ఆమె కింద పడిపోయింది. స్థానికులు వారి మధ్య గొడవను ఆపారు. కూతురు కూడా వచ్చి మందలించి వెళ్లిపోయింది. ఆమె మరుసటి రోజు కూడా అదే విధంగా తాగి వచ్చి ఇంటిముందు కింద పడిపోగా స్థానికులు ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు. కొడుకు తల్లిని నిద్రలేపడానికి ప్రయత్నించగా తను స్పందించకపోవడంతో స్థానికుల సహకారంతో చూడగా ఆమె అప్పటికే చనిపోయిందని గుర్తించారు. మహిళ మరణానికి గల కారణాలను పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత వెల్లడిస్తామని సీఐ తెలిపారు.


Related News

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

West Godavari Crime: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య, సోదరుడికి మెసేజ్, పాలకొల్లులో దారుణం

Fire Accident: ఏపీ, తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు

UP Crime News: మైనర్ ప్రియురాలిని కాల్చిన ప్రియుడు, ఆ తర్వాత ఏం జరిగింది? యూపీలో దారుణం

Srikakulam Crime: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దరిని చంపేశాడు.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Big Stories

×