E-Paper
Advertisement

Opposition Meet: కలిసి పోటీ.. బీజేపీకి విపక్షాల బిగ్ షాక్..

Opposition Meet: కలిసి పోటీ.. బీజేపీకి విపక్షాల బిగ్ షాక్..
Advertisement
Opposition Meet

Opposition Parties Meeting Today(Latest political news in India): విపక్షాలు అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీని గద్దె దింపేందుకు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. జేడీఎస్ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో.. దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ జట్టు కట్టాయి. పట్నాలో విస్తృత కసరత్తు చేశాయి. 2024 ఎన్నికల్లో.. 17 విపక్ష పార్టీలు కలిసి బరిలో దిగాలని.. పరస్పరం సహకరించుకోవాలని.. బీజేపీని ఓడించాలని డిసైడ్ అయ్యాయి. భవిష్యత్‌ కార్యాచరణకు జులైలో సిమ్లాలో మరోసారి సమావేశం కానున్నారు. అయితే, ఈ కీలక భేటీకి ఆప్ అధినేత కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లతో పాటు దేవేగౌడ, మాయావతి తదితరులు హాజరుకాలేదు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్‌కు అసలు ఆహ్వానమే లేదు.

బీజేపీ దాడులను కలిసికట్టుగా ఎదుర్కొంటామని.. తామంతా కలిసి పని చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. వచ్చే సమావేశంలో ప్రతిపక్షాల ఐక్యతపై మరింత ముందడుగు వేస్తామన్నారు రాహుల్. దేశ శ్రేయస్సుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

Advertisement

17 విపక్ష పార్టీలు కలిసి పోటీచేయాలనే నిర్ణయం మామూలుది కాదు. బీజేపీకి మైండ్ బ్లాంక్ డెసిషన్ ఇది. బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా.. ప్రతిపక్షాల తరఫున ఒకే అభ్యర్థిని నిలబెట్టనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా.. ఇలా ఉమ్మడిగా అభ్యర్థిని బరిలో దింపి.. బీజేపీని దెబ్బకొట్టాలనేది వ్యూహం.

అయితే, ఆప్, డీఎంకే, బీఆర్ఎస్ లాంటి పార్టీలన్నీ కలిస్తేనే ఈ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుంది. రెబెల్ బెడదా ఉంటుంది. ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తూ.. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఈ భేటీకి డుమ్మా కొట్టారు. కూటమిలో కాంగ్రెస్సే కీ పార్టీ కాబట్టి.. డీఎంకే సైతం సపోర్ట్ చేస్తుంది. ఇక, కాంగ్రెస్ ఉంది కాబట్టి.. బీఆర్ఎస్-కేసీఆర్ ఈ కూటమికి దూరంగా ఉన్నారు. అందులోనూ గులాబీ బాస్ బీజేపీ మనిషేననే అనుమానమూ ఉంది. మైనస్‌లు ఎలా ఉన్నా.. ఏకంగా 17 ప్రతిపక్ష పార్టీలు ఇలా ఉమ్మడి అభ్యర్థి స్ట్రాటజీతో రంగంలోకి దిగడం కమలదళాన్ని కంగారు పెట్టే రాజకీయ ఏకీకరణే అంటున్నారు. అయితే, ఆ బెదరు కనిపించకుండా.. అదంతా ఫోటో సెషన్ కోసం ఏర్పాటు చేసుకున్న మీటింగ్ అంటూ అమిత్ షా సెటైర్లు వేయడం ఆసక్తికరం.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×