E-Paper
Advertisement

Warangal: జాతరల ఖిల్లాగా ఓరుగల్లు జిల్లా.. జనవరిలో భక్త జనసంద్రోహం

Warangal: జాతరల ఖిల్లాగా ఓరుగల్లు జిల్లా.. జనవరిలో భక్త జనసంద్రోహం

ఓరుగల్లు జిల్లా జాతరల ఖిల్లాగా మారబోతోంది. జనవరి నెలలో వరుస జాతరలతో భక్త జనసంద్రంగా మారనుంది. తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహా జాతరతో పాటు… ఐలోని మల్లన్న, కొత్తకొండ వీరభద్ర స్వామి, గట్టుమల్లన్న, కట్ట మల్లన్న, దూడల మల్లన్న, అగ్రంపాడ్ జాతరలు జనవరి నెలలో జరగనున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువైన కొమరవెల్లి వీరన్న, కొత్తకొండ వీరభద్ర స్వామి, ఐలోని మల్లన్న ఉత్సవాలు, మేడారం సమ్మక్క జాతరలు జనవరి నెలలో జరగనున్నాయి. ఓరుగల్లు జిల్లాలో, జానపదుల జాతరలు జనవరి నెలలో సందడి చేయనున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలుగా విలసిల్లుతున్న హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, ఐలోని మల్లన్న జాతరలు, వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు.

జనవరి 28 నుండి 31 వరకు వనదేవతలైన సమ్మక్క సారలమ్మల మేడారం జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. నెల రోజుల ముందు నుండే భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు సమర్పిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని 251 కోట్ల రూపాయల నిధులతో మహా అద్భుత కళాఖండంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. దీంతో గత జాతరల కంటే ఈసారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరగనుంది. జాతర సమయంలో కోటికి పైగా భక్తులు వచ్చినా… ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

ప్రాచీన శైవ క్షేత్రమైన అయినవోలు మల్లన్న మహా జాతర జనవరి 13 నుండి 15 వరకు జరుగనుంది. 13న బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, 14న భోగి, 15న సంక్రాంతి రోజున ప్రభ బండ్ల ప్రదక్షిణతో మూడు రోజుల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఐలోని మల్లన్న జాతర సంక్రాంతికి మొదలై ఉగాది వరకు మూడు నెలల పాటు కొనసాగుతుంది. గత ఎడాది అయినవోలు మల్లన్న జాతరకు 30 లక్షల మంది పైగా భక్తులు హాజరయ్యారు.

మకర సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్ర స్వామి జాతర జరుగుతుంది. కోరినకోర్కెలు నెరవేర్చే కోర మీసాల వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. జనవరి 10న అంకురార్పణ, స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణం జరగనుంది. 13న మహా లింగార్చన, 14న అరుణయంత్రస్థాపన చండీ హోమం, 15న ఉత్తరాయన పుణ్యకాలం, ప్రభవన్ ల ప్రదక్షిణ ఉండనుంది. 18న అగ్నిగుండాలో, స్వామి వారి గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. గతేడాది వీరభద్ర స్వామి జాతరకు సుమారు 26 లక్షల మంది హాజరయ్యారు.

కీలకమైన మేడారం, ఐనవోలు, కొత్తకొండ జాతరలతో పాటు… అగ్రంపాడు సమ్మక్క జాతర, గొర్రెకుంటలోని కట్ట మల్లన్న, మల్లికుదుర్లలోని గట్టు మల్లన్న, దూడల మల్లన్న జాతరలు సైతం జనవరి నెలలోనే జరగనున్నాయి. జనవరి నెల మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సందడి కనిపించనుంది. కోట్లాదిమంది భక్తుల రాకతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది ఓరుగల్లు.

ALSO READ: Bandi Sanjay: పండగలు వచ్చినప్పుడే డ్రగ్స్ కేసులు గుర్తొస్తాయా..? బండి సంజయ్ ఆగ్రహం

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×