E-Paper
Advertisement

Koushik Reddy : నేను రాజీనామా చేస్తా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సిద్ధమా?

Koushik Reddy : నేను రాజీనామా చేస్తా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సిద్ధమా?
Advertisement

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : నేను రాజీనామా చేస్తా.. బీఆర్ఎస్ పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే కాంగ్రెస్‌ చేరిన వారంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అవసరం అయితే పార్టీ అధినేత కేసీఆర్ ను ఒప్పిస్తా ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తాం మీరు సిద్దమా అన్నారు.

ఎస్ డీఎఫ్ నిధులు ప్రభుత్వానివా? కాంగ్రెస్ పార్టీవా? అనేది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు తిరస్కరించిన వారు ప్రపోజల్స్ పంపిస్తే నిధులు ఎలా శాంక్షన్ చేస్తారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా నిధులు అడిగితే కాంగ్రెస్‌ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు.

Advertisement

తన నియోజకవర్గంలో 50 శాతమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. మిగతా 50 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశానని పేర్కొన్నారు. మీరు బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరూలేరని కాంగ్రెస్‌ నేతలను హెచ్చరించారు. రూ.15 వేల రైతు భరోసా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అమ్ముడుపోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవి సంజయ్‌కు కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని అన్నారు. దమ్ముంటే సంజయ్‌ రాజీనామా చేసి కాంగ్రెస్‌ టికెట్‌తో గెలవాలని డిమాండ్‌ చేశారు.

Also Read :  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. పేలిపోయిన కారు రెండు టైర్లు..

Tags

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×