E-Paper
Advertisement

Padma Awards 2024 : వెంకయ్యనాయుడు, చిరంజీవీలను వరించిన పద్మ విభూషణ్.. మరో ఐదుగురికి పద్మశ్రీ అవార్డ్‌లు..

Padma Awards 2024 :  వెంకయ్యనాయుడు, చిరంజీవీలను వరించిన పద్మ విభూషణ్.. మరో ఐదుగురికి పద్మశ్రీ అవార్డ్‌లు..
Advertisement

Padma Awards 2024 : తెలుగు ప్రముఖులు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి‌కి దేశం రెండో అత్యున్న‌త పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డ్ వరించింది. దేశ వ్యాప్తంగా మొత్తం ఐదుగురికి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది పద్మ అవార్డులకు ఎంపిక అయ్యారు.

దేశం అమృతం కాలం దిశగా అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న తరుణంలో తనకు పద్మ విభూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డ్‌ తనపై మరింత బాధ్యతలను పెంచిందని తెలిపారు. యువత, రైతులు, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి తనకు వచ్చిన పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని ప్రకటించారు.

Advertisement

తనకు పద్మ విభూషణ్ అవార్డ్ రావడంపై సినీ ప్రముఖుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తనను సొంత మనిషిగా అభిమానులు భావిస్తున్నారన్నారు. అన్నయ్యగా.. బిడ్డగా భావించే కోట్లమంది ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు.. నీడలా వెన్నంటి నడిచే కోట్లమంది అభిమానులు ప్రేమ, ఆదరణ వల్లే తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమని చిరంజీవి తెలిపారు.

తెలుగురాష్ట్రాల నుంచి ఇద్దరికి పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప , వేలు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యులు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమా మహేశ్వరి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయ్యారు.

Advertisement

.

.

Related News

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్ మున్సిపల్‌గా తిరుపతి.. పెరిగిన డివిజన్లు!

విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

వైసీపీ సవాల్‌కు సై.. పదింతలు పనిచేసి చూపిస్తా! మంత్రి నారాయణ మాస్ కౌంటర్

డీఎస్సీ, APPSC అక్రమాలపై CBI విచారణ జరపాల్సిందే.. మాజీ మంత్రి అంబటి డిమాండ్!

Big Stories

Advertisement
×