E-Paper
Advertisement
Gruhajyothi Scheme : ఎన్నికల హామీలపై కసరత్తు.. గృహజ్యోతి స్కీమ్ అమలుకు ప్రణాళికలు..
CM Revanth Reddy Davos Tour : తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం రేవంత్ ఆహ్వానం..
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు.. బాలయ్య ఆదేశాలతో తీసేశారా..?
MLC Elections : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు.. అందుకే వారికి అవకాశం దక్కింది : ఉత్తమ్

MLC Elections : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు.. అందుకే వారికి అవకాశం దక్కింది : ఉత్తమ్

MLC Elections : ఎమ్మెల్యేల కోటా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహేశ్‌ కుమార్ గౌడ్‌, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం రావడమే ఇందుకు మంచి ఉదాహరణగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమవుతాయని భావిస్తున్నామన్నారు. […]

Ponnam Prabhakar : ‘హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉంది..’ సర్పంచ్ ఆత్మీయ సమావేశాలపై కేటీఆర్‌‌కు మంత్రి కౌంటర్..

Ponnam Prabhakar : ‘హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉంది..’ సర్పంచ్ ఆత్మీయ సమావేశాలపై కేటీఆర్‌‌కు మంత్రి కౌంటర్..

Ponnam Prabhakar : సిరిసిల్లలోని బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌కు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. పనుల పేరుతో..సస్పెన్షన్ల పేరుతో వారిని వేధించింది నిజం కాదా అంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్‌. బీఆర్‌ఎస్‌ హయాంలో 1100 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇప్పుడు మళ్లీ రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి పొన్నం.

MLC Elections : నేడే నామినేషన్లకు చివరి రోజు.. ఎన్నిక లాంఛనమే..!
Telangana Government : రిటైర్డ్ ఎంప్లాయిస్ పై ప్రభుత్వం ఫోకస్.. ఉద్యోగుల గుండెల్లో గుబులు..

Telangana Government : రిటైర్డ్ ఎంప్లాయిస్ పై ప్రభుత్వం ఫోకస్.. ఉద్యోగుల గుండెల్లో గుబులు..

Telangana Government : ప్రభుత్వ అధికారులు పదవీ విరమణ పొందినా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్నవారిపై దృష్టిసారించింది తెలంగాణ సర్కార్‌. ఎక్స్‌టెన్షన్‌, రీ అపాయింట్‌మెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పేరుతో పనిచేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు వంద మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాట్లు తెలుస్తోంది. సీఎస్‌ శాంతి కుమారి ఆదేశాలతో రిటైర్డ్‌ ఉద్యోగుల వివరాలను పొందుపరిచేందుకు ఒక నిర్ధిష్టమైన ఫార్మాట్‌ను కూడా రూపొందించి అన్ని ప్రభుత్వ శాఖలకు పంపడంతో ఆ వివారాలను సేకరించి సీల్డ్‌ కవర్‌లో సీఎస్‌కు అందించింది. దీంతో జిల్లా కలెక్టరేట్లలో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు వివిధ హోదాల్లో ఇప్పటికీ కొలువుల్లో కొనసాగుతున్న రిటైర్డ్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు రేగుతోంది.

Hyderabad : పబ్ లో ఘర్షణ.. కత్తులు, బీర్ బాటిళ్ల తో పరస్పర దాడి..
NTR : ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి.. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అంటూ ప్రశంసలు..

NTR : ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి.. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అంటూ ప్రశంసలు..

NTR: సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా కీర్తిని అందుకుని..రాజకీయ రంగంలో కూడా తనకు తిరుగులేదనిపించుకున్న నందమూరి తారక రామారావు వర్ధంతి. ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, టీటీడీపీ నేతలు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా బేగంపేట్‌ రసూల్‌పుర చౌరస్తాలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ఎన్‌టిఆర్ ఘాట్ వరకు అమర జ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు టీడీపీ నేతలు.

TSRTC : మహిళలకు ఉచిత ప్రయాణం.. సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌..!
CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ కృషితో.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం రేవంత్ బృందం.. కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ కు విశిష్ట ఆదరణ లభిస్తుంది. ఈ సదస్సు వేదికగా తెలంగాణకు ఇప్పటి వరకు రూ.40,270 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల తో అగ్రిమెంట్ కుదిరినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రూ.37,800 కోట్ల పెట్టుబడులకు పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో సీఎం రేవంత్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

TS Governor : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలు.. తమిళిసై కీలక నిర్ణయం..
Adulterated Oil : జంతు కళేబరాలే ముడిసరుకు.. కల్తీ నూనె తయారీ కలకలం..
Telangana MLC Candidates : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్.. మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్‌కి ఛాన్స్..

Big Stories

Advertisement
×