E-Paper
Advertisement

Gadwal News: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం డబ్బు డిమాండ్.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Gadwal News: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం డబ్బు డిమాండ్..  లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Gadwal News:  ఇందిరమ్మ ఇళ్ల బిల్లు మంజూరు కోసం లబ్ధిదారు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఐజ మండలం ఏక్లాస్ పూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి రంగన్న ఆ గ్రామంలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణదారురాలి బిల్లు మంజూరుకు 4 విడతలకు ఒక్కో విడత చొప్పున 5 వేలు డిమాండ్ చేశాడు. లబ్ధిదారురాలి భర్త అభ్యర్థన మేరకు 15 వేలకు ఒప్పుకున్నాడు. మొదటి విడతలో 5 వేలతో పాటు మిగతా మూడు విడుతలకు నగదు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.

Also Read:Viral Video: వ్యూస్ కోసం వెర్రి వేషాలు.. స్కూటీ డిక్కీలో పసిపాప, ఈ కిలాడీ లేడీ చేసిన పని చూస్తే…?

ఈ మేరకు ఐజ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో లబ్ధిదారు నుంచి సెక్రటరీ నగదు స్వీకరించాడు. ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. నిందితుడి రెండు చేతి వేళ్లకు, అతను ధరించిన ప్యాంటు యొక్క ఎడమ వైపు ముందు జేబు లోపలి భాగానికి రసాయన పరీక్ష నిర్వహించగా, సానుకూల ఫలితాలు వచ్చాయి. నిందితుడు ధరించిన ప్యాంటు యొక్క ఎడమ వైపు ముందు జేబు నుండి లంచం మొత్తం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ఏసీబీ డి.ఎస్.పి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల నుంచి అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064తో పాటు ఇతర సోషల్ ప్లాట్ ఫామ్ వేదికగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Also Read: Summer Bike Helmet Tips: బైక్ రైడర్లకు సమ్మర్ టిప్స్… హెల్మెట్‌ ఇలా పెట్టుకుని వెళ్తే కూల్‌ గా ఉంటారు!

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×