E-Paper
Advertisement

Mahesh Kumar Goud: రైతుల కంట్లో క‌న్నీరు కారితే.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప‌న్నీరు కారింది: పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: రైతుల కంట్లో క‌న్నీరు కారితే.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప‌న్నీరు కారింది: పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Goud: రైతుల కంట్లో క‌న్నీరు కారితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప‌న్నీరు కారింద‌ని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఏర్పాటు చేసిన రైతు పండుగ స‌భ‌లో మ‌హేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వం అని చెప్పారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మొదలుకుని నేటి సీఎం రేవంత్ రెడ్డి వ‌ర‌కు రైతుల శ్రేయ‌స్సు కోస‌మే ప‌నిచేశార‌ని అన్నారు. గ‌త ప్ర‌భుత్వంలో రైతులు ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని చెప్పారు.

Also read: ఒళ్లు జలదరించే యాక్షన్ సీన్… సెన్సార్ కట్ చేసినా చిన్న పిల్లలు భయపడుతారు

Advertisement

రైతులు ప‌డుతున్న ఇబ్బందులు చూసి కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వ‌రంగ‌ల్ స‌భ‌లో మే 22న రైతుల‌కు కావాల్సిన సంక్షేమం, రైతుల‌కు కావాల్సిన రైతు డిక్ల‌రేష‌న్ చేశార‌ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్ర‌భుత్వం ఇచ్చిన మాట ప్ర‌కారం, రైతుల ద‌య వ‌ల్ల అధికారంలోకి వ‌చ్చి కాంగ్రెస్ పార్టీ అనుక్ష‌ణం రైతుల సంక్షేమం కోస‌మే ఆలోచిస్తోంద‌ని, రైతుల కోస‌మే ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. అందుకోస‌మే గ‌త ప‌దేళ్ల‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేయ‌ని రుణ‌మాఫీ రూ.18వేల కోట్లు తొమ్మిది నెల‌ల్లో ఇచ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు.

మ‌ల్లికార్జున ఖ‌ర్గే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క ఇత‌రులు అంతా రైతు కుటుంబం నుండి వ‌చ్చిన‌వాళ్ల‌మేన‌ని అన్నారు. రైతుల కోస‌మే ప‌నిచేసే ప్ర‌భుత్వం తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చింద‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా రైతు పండుగ స‌భ‌లో మ‌రో 3 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రుణ‌మాఫీ నిధుల‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ స‌భ‌కు రైతులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. మూడు రోజుల పాటూ స‌ద‌స్సును నిర్వ‌హించగా ఇందులో భాగంగా రైతుల‌కు ఆధునిక వ్య‌వ‌సాయం, హైబ్రిడ్ విత్త‌నాలు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలపై అవ‌గాహ‌న క‌ల్పించారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×