E-Paper
Advertisement

Petrol Shortage: హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. డబ్బాలు, బాటిళ్లతో బంకుల వద్ద క్యూ.. యుద్ధం ఎక్కడో.. భయం ఇక్కడ!

Petrol Shortage: హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. డబ్బాలు, బాటిళ్లతో బంకుల వద్ద క్యూ.. యుద్ధం ఎక్కడో.. భయం ఇక్కడ!
Advertisement

Petrol Shortage: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు సరఫరా నిలిచిపోతుందనే పుకార్లు హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా కలకలం రేపాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకుంటాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడంతో, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తాయన్న భయంతో, వాహనదారులు తమ వాహనాలకు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి బంకుల వద్దకు పోటెత్తారు.

హైదరాబాద్‌లో పెట్రో కల్లోలం..
ఇక నగరంలోని ముఖ్య ప్రాంతాలైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. పెట్రోల్ బంకులు వాహనాలతో కిక్కిరిసిపోగా, క్యూ లైన్లు ప్రధాన రహదారుల వరకు విస్తరించాయి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వాహనదారులు బారులు తీరడం గమనార్హం. కేవలం వాహనాలకే కాకుండా, ముందు జాగ్రత్తగా ప్లాస్టిక్ డబ్బాలు, బాటిళ్లతో వచ్చి ఇంధనాన్ని నింపుకోవడానికి జనం పోటీ పడ్డారు.

Advertisement

కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు..
ఈ అకస్మాత్తు రద్దీ కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బంకుల బయట రోడ్ల మీదే వాహనాలు నిలపడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ఆఫీసులకు వెళ్లేవారు, అత్యవసర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ, వాహనాల తాకిడి తగ్గకపోవడంతో నియంత్రించడం కష్టతరంగా మారింది.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక బంకుల వద్ద సరఫరా నిలిచిపోతుందన్న భయంతో గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అధికారులు ఎన్ని హామీలు ఇస్తున్నప్పటికీ, ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావం కారణంగా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. పెట్రోల్ బంకు యాజమాన్యాలు కూడా వాహనదారులను నియంత్రించలేక చేతులెత్తేస్తున్నారు.

Advertisement

Also Read: ఫార్ములా ఈ కార్ లొట్టపీసు కేసు.. మరి భయం ఎందుకు సారు!

పెట్రోల్ కొరతపై రూమర్స్ నమ్మొద్దు..
ప్రస్తుతానికి చమురు కంపెనీలు లేదా ప్రభుత్వం ఇంధన కొరతపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. క్షేత్రస్థాయిలో సరఫరా సాధారణంగానే ఉన్నప్పటికీ, కేవలం పుకార్ల వల్లే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు అనవసరంగా భయపడి భారీగా నిల్వ చేసుకోవడం వల్లే ఇంధన పంపిణీలో అంతరాయం కలుగుతోందని, సంయమనం పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×