Phone Tapping Case: గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై సిట్ ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. రేపు (మంగళవారం) ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
విచారణలో భాగంగా అరెస్టయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హరీష్ రావుకు ఈ నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఎవరికి చేరింది? ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. మరోవైపు, ఈ కేసులో మరికొంతమంది కీలక నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also: Uttam Kumar Reddy: హుజూర్నగర్ రైతాంగానికి శుభవార్త.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన!