E-Paper
Advertisement

PM Modi: సింగరేణిపై మోదీ క్లారిటీ.. కేసీఆర్ కు ఈరోజు నిద్ర పట్టదా?

PM Modi: సింగరేణిపై మోదీ క్లారిటీ.. కేసీఆర్ కు ఈరోజు నిద్ర పట్టదా?

PM Modi: పీఎం మోదీ బ్యాక్ టు బ్యాక్ పంచ్ లు వేస్తున్నారు. పరోక్షంగా టీఆర్ఎస్, కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. ఇటు హైదరాబాద్ లో బీజేపీ నేత హోదాలో గట్టి హెచ్చరిక పంపగా.. రామగుండం సభలో సైతం అదే జోరు కంటిన్యూ చేశారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. హైదరాబాద్ లో ఉన్నోళ్లకు ఈ రోజు నిద్ర పట్టదంటూ.. ఇన్ డైరెక్ట్ గా కేసీఆర్ ను టార్గెట్ చేశారు మోదీ.

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని బహిరంగ సభ సాక్షిగా స్పష్టం చేశారు ప్రధాని మోదీ. హైదరాబాద్ నుంచి కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. సింగరేణిలో తెలంగాణ వాటా 51 శాతం ఉందని.. కేంద్రం వాటా కేవలం 49 శాతమేనని గుర్తు చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు. బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈరోజు వారికి నిద్ర పట్టదంటూ పీఎం మోదీ ఆగ్రహంగా మాట్లాడారు.

మోదీ మాటలన్నీ కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారును ఉద్దేశించేనని అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటినీ మోదీ అమ్మేస్తున్నారని.. ముందుముందు సింగరేణి గనులను కూడా ప్రైవేటుకు కట్టబెడతారంటూ కొంతకాలంగా గులాబీ నేతలు బాగా ప్రచారం చేస్తున్నారు. వారి ఆరోపణలకు చెక్ పెట్టేందుకు రామగుండం బహిరంగ సభను వేదికగా చేసుకున్నారు పీఎం మోదీ. లక్షలాది ప్రజల సమక్షంలో.. సింగరేణిని ప్రైవేటీకరించేది లేదని, ఆ హక్కు రాష్ట్రానిదే కానీ కేంద్ర ప్రభుత్వానిది కాదంటూ.. క్లారిటీగా చెప్పేశారు.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×