BigTV English
Advertisement

PM Modi: సింగరేణిపై మోదీ క్లారిటీ.. కేసీఆర్ కు ఈరోజు నిద్ర పట్టదా?

PM Modi: సింగరేణిపై మోదీ క్లారిటీ.. కేసీఆర్ కు ఈరోజు నిద్ర పట్టదా?

PM Modi: పీఎం మోదీ బ్యాక్ టు బ్యాక్ పంచ్ లు వేస్తున్నారు. పరోక్షంగా టీఆర్ఎస్, కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. ఇటు హైదరాబాద్ లో బీజేపీ నేత హోదాలో గట్టి హెచ్చరిక పంపగా.. రామగుండం సభలో సైతం అదే జోరు కంటిన్యూ చేశారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. హైదరాబాద్ లో ఉన్నోళ్లకు ఈ రోజు నిద్ర పట్టదంటూ.. ఇన్ డైరెక్ట్ గా కేసీఆర్ ను టార్గెట్ చేశారు మోదీ.


సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని బహిరంగ సభ సాక్షిగా స్పష్టం చేశారు ప్రధాని మోదీ. హైదరాబాద్ నుంచి కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. సింగరేణిలో తెలంగాణ వాటా 51 శాతం ఉందని.. కేంద్రం వాటా కేవలం 49 శాతమేనని గుర్తు చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు. బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈరోజు వారికి నిద్ర పట్టదంటూ పీఎం మోదీ ఆగ్రహంగా మాట్లాడారు.

మోదీ మాటలన్నీ కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారును ఉద్దేశించేనని అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటినీ మోదీ అమ్మేస్తున్నారని.. ముందుముందు సింగరేణి గనులను కూడా ప్రైవేటుకు కట్టబెడతారంటూ కొంతకాలంగా గులాబీ నేతలు బాగా ప్రచారం చేస్తున్నారు. వారి ఆరోపణలకు చెక్ పెట్టేందుకు రామగుండం బహిరంగ సభను వేదికగా చేసుకున్నారు పీఎం మోదీ. లక్షలాది ప్రజల సమక్షంలో.. సింగరేణిని ప్రైవేటీకరించేది లేదని, ఆ హక్కు రాష్ట్రానిదే కానీ కేంద్ర ప్రభుత్వానిది కాదంటూ.. క్లారిటీగా చెప్పేశారు.


Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Big Stories

×