E-Paper
Advertisement

PM Modi: సింగరేణిపై మోదీ క్లారిటీ.. కేసీఆర్ కు ఈరోజు నిద్ర పట్టదా?

PM Modi: సింగరేణిపై మోదీ క్లారిటీ.. కేసీఆర్ కు ఈరోజు నిద్ర పట్టదా?
Advertisement

PM Modi: పీఎం మోదీ బ్యాక్ టు బ్యాక్ పంచ్ లు వేస్తున్నారు. పరోక్షంగా టీఆర్ఎస్, కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. ఇటు హైదరాబాద్ లో బీజేపీ నేత హోదాలో గట్టి హెచ్చరిక పంపగా.. రామగుండం సభలో సైతం అదే జోరు కంటిన్యూ చేశారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. హైదరాబాద్ లో ఉన్నోళ్లకు ఈ రోజు నిద్ర పట్టదంటూ.. ఇన్ డైరెక్ట్ గా కేసీఆర్ ను టార్గెట్ చేశారు మోదీ.

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని బహిరంగ సభ సాక్షిగా స్పష్టం చేశారు ప్రధాని మోదీ. హైదరాబాద్ నుంచి కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. సింగరేణిలో తెలంగాణ వాటా 51 శాతం ఉందని.. కేంద్రం వాటా కేవలం 49 శాతమేనని గుర్తు చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు. బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈరోజు వారికి నిద్ర పట్టదంటూ పీఎం మోదీ ఆగ్రహంగా మాట్లాడారు.

Advertisement

మోదీ మాటలన్నీ కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారును ఉద్దేశించేనని అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటినీ మోదీ అమ్మేస్తున్నారని.. ముందుముందు సింగరేణి గనులను కూడా ప్రైవేటుకు కట్టబెడతారంటూ కొంతకాలంగా గులాబీ నేతలు బాగా ప్రచారం చేస్తున్నారు. వారి ఆరోపణలకు చెక్ పెట్టేందుకు రామగుండం బహిరంగ సభను వేదికగా చేసుకున్నారు పీఎం మోదీ. లక్షలాది ప్రజల సమక్షంలో.. సింగరేణిని ప్రైవేటీకరించేది లేదని, ఆ హక్కు రాష్ట్రానిదే కానీ కేంద్ర ప్రభుత్వానిది కాదంటూ.. క్లారిటీగా చెప్పేశారు.

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×