E-Paper
Advertisement

PM Modi: ఫాంహౌజ్ కేసుపై వ్యూహాత్మక మౌనం?.. అందుకేనా మోదీ వార్నింగ్?

PM Modi: ఫాంహౌజ్ కేసుపై వ్యూహాత్మక మౌనం?.. అందుకేనా మోదీ వార్నింగ్?

PM Modi: హైదరాబాద్ గడ్డపై మోదీ స్పీక్ అదిరిపోయింది. సీఎం కేసీఆర్ కు పరోక్షంగా గట్టి హెచ్చరిక చేశారు. దోచుకునే వాళ్లను వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఐటీలో ముందున్న రాష్ట్రాన్ని మూఢవిశ్వాస శక్తులు పాలిస్తున్నాయని.. అవినీతిపరులతో చేతులు కలిపారంటూ.. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అవినీతిని సహించనందుకే కొందరు తనను తిడుతున్నారని.. రోజూ రెండు, మూడు కిలోల తిట్లు తింటున్నానని.. అవే ప్రోటీన్లుగా మారి తనకు మరింత శక్తి ఇస్తోందంటూ సెటైరికల్ గా పంచ్ లు వేశారు. తనను, బీజేపీని ఎంత తిట్టినా పట్టించుకోనని.. కానీ, తెలంగాణ ప్రజల జోలికి వస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.

మునుగోడు ఎన్నిక గురించి కూడా మాట్లాడారు మోదీ. ఒక్క అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ సర్కారు మొత్తం మునుగోడులో మకాం వేసిందని ఎద్దేవా చేశారు. మునుగోడులో కమల వికాసం కనిపించిందని.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రజలు చాటి చెప్పారని మోదీ అన్నారు.

ఇలా, తెలంగాణ అంశాలన్నిటినీ టచ్ చేస్తూ మోదీ ప్రసంగం కొనసాగింది. కేసీఆర్ విమర్శలు, మునుగోడు ఎన్నికలు, కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ పొత్తు, అవినీతి ఆరోపణలు.. ఇలా తెలంగాణ రాజకీయాలపై మోదీ తనదైన స్టైల్ లో మాట్లాడారు. కానీ, ఒక్కటి మాత్రం మిస్ చేశారు. అదే మొయినాబాద్ ఫాంహౌజ్ ఎపిసోడ్. కావాలనే ఫాంహౌజ్ కేసుపై మోదీ మాట్లాడలేదని టీఆర్ఎస్ అంటోంది. అదంతా వ్యూహాత్మక మౌనమనేది విశ్లేషకుల మాట.

ఫాంహౌజ్ కేసే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. రిలీజైన వీడియో, ఆడియోల్లో.. అమిత్ షా, బీఎల్ సంతోష్ ల పేర్లు పదే పదే వినిపించాయి. మధ్య మధ్యలో మోదీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. కీలకమైన ఫాంహౌజ్ విషయం వదిలేసి.. మునుగోడు, అవినీతి, కామ్రేడ్ల పేరు తీసి మరీ మోదీ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరం. ఫాంహౌజ్ ప్రస్తావన తీసుకొస్తే.. బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందనే ఉద్దేశ్యంతోనే మోదీ కావాలనే ఆ విషయం దాటేశారని అంటున్నారు.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×