BigTV English
Advertisement

Sircilla: న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాదులు

Sircilla: న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాదులు

Lawyers Protest: రాజన్న సిరిసిల్లలో న్యాయవాదులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమ విధులనూ బహిష్కరించారు. సివిల్ కేసుల్లో కోర్టు ఉత్తర్వులు ఉన్నా పోలీసులు జోక్యం చేసుకోవడంపై అభ్యంతరం చెబుతున్నారు. కక్షిదారులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కోర్టులు వెలువరించే ఉత్తర్వులను సిరిసిల్ల పోలీసులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు.


ఐదు రోజులుగా సిరిసిల్ల న్యాయవాదులు నిరసనలు చేస్తున్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణం ప్రెస్‌క్లబ్‌లో సిరిసిల్ల బార్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దోర్నాల సంజీవ్ రెడ్డి, అడ్వకేట్ రమాకాంత్‌ సహా పలువురు తమ అభ్యంతరాలను మీడియాకు ఏకరువు పెట్టారు.

Also Read: స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన


సివిల్ కేసుల్లో కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు కక్షిదారులపైనే కేసులు పెడుతున్నారని, కోర్టులు వెలువరిస్తున్న ఆర్డర్‌లను బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయడమంటే ప్రజల హక్కులను కాలరాయడమేనని అభిప్రాయపడ్డారు. 5 రోజులుగా కోర్టు విధులు బహిష్కరిస్తున్నా పోలీసు శాఖలో కదలిక లేదని పేర్కొన్నారు. న్యాయ స్థానాల ఆదేశాలను పోలీసులు లెక్క చేయడం లేదన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీని కలవడానికి వెళ్లితే తమకు సమయం కేటాయించలేదని ఆరోపించారు. ప్రజల న్యాయ హక్కులను సంరక్షించడానికి పాటుపడే న్యాయవాదులు రోడ్డెక్కినా పోలీసులు స్పందించకపోవడం బాధాకారం అని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన పోలీసులు వారి హక్కులను భక్షించడం తగదని హితవు పలికారు. ప్రజల పక్షాన పోరాడటానికి న్యాయవాదులు ఎల్లప్పుడూ ముందుంటారని దోర్నాల సంజీవ రెడ్డి, రమాకాంత్‌లు చెప్పారు.

Tags

Related News

Adilabad Airport: దశాబ్దాల కల నెరవేరే ఛాన్స్.. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Sanga Reddy: భార్య చెప్పిన పాస్ట్ లవ్ స్టోరీ మనస్తాపంతో.. పెళ్లయిన నెలలకే నవవరుడి ఆత్మహత్య.. !

Jubilee Hills Byelection: సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

DCC Presidentship: మేడిపల్లికి.. డీసీసీ పగ్గాలు

Jagityala News: రూ.50 లేక తల్లిని భుజాన మోసిన కుమారుడు.. కన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం

TGSRTC: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పులేదని ప్రాథమిక నిర్ధారణ

Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారాల్లో కనిపించని ఆ ఇద్దరు కీలక నేతలు..?

Jubilee by-election: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఏ పార్టీపై ఎఫెక్ట్ పడనుంది..?

Big Stories

×