Medchal News: మేడ్చల్ బ్యూరో, స్వేచ్ఛ: హకీంపేట్ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో విద్యార్థి శ్రీనాథ్ ఆత్మహత్యయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. జవహర్నగర్ ఏసీపీ చక్రపాణి, షామీర్పేట్ సీఐ శ్రీనాథ్ పాఠశాలను సందర్శించి తోటి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆత్మహత్యయత్నం దారితీసిన కారణాలపై విద్యార్థులను ప్రశ్నించి సమాచారం తెలుసుకున్నారు. పాఠశాల యాజమాన్యం, సిబ్బందితోనూ విచారణ జరిపినట్లు తెలిసింది. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, విద్యార్థి ఆత్మహత్యయత్నం ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనాథ్ మేనమామ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పాఠశాల వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. జరిగిన ఘటనపై తల్లిదండ్రులకు సమయానికి సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ ఏర్పాటు చేయకుండా ఆటోలో ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
Also Read: Maoist Rehabilitation: అడవిలో కాదు.. ఇప్పుడే అసలైన యుద్ధం! కలెక్టర్ ఆఫీసులో మాజీ మావోయిస్టు వసంత!