E-Paper
Advertisement

Gelatin Explosives Items: సాల్వో నుంచే టెర్రరిస్టులకు జిలెటిన్‌ స్టిక్స్‌.. బయటపడ్డ అసలు నిజాలు

Gelatin Explosives Items: సాల్వో నుంచే టెర్రరిస్టులకు జిలెటిన్‌ స్టిక్స్‌.. బయటపడ్డ అసలు నిజాలు
Advertisement

Gelatin Explosives Items: ఛత్తీస్‌గఢ్‌కు చేరుతున్న జెలిటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలపై నిగ్గు తేల్చారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే మావోయిస్టులకు పేలుడు పదార్థాలు చేరుతున్నట్లు గుర్తించారు. కీసరలోని సాల్వో కంపెనీ నుంచే మావోయిస్టులకు.. పేలుడు పదార్థాలను సప్లై చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇటీవల మావోయిస్టులకు జెలిటిన్ స్టిక్ సరఫరా చేస్తున్న వ్యక్తిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కొంతకాలం ఆర్ఎంపీగా పని చేసిన రాము, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రభుత్వ టీచర్‌ను 2014లో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం మావోయిస్టులు రామును అడవికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స చేశాడు. మావోయిస్టుల విజ్ఞప్తితో పేలుడు పదార్థాలు సప్లై చేసేందుకు సిద్ధమయ్యాడు.

జగిత్యాలలో తనకు క్వారీలు ఉన్నాయని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసిన రాము, వాటిని మావోయిస్టులకు చేరవేశాడు. అలా, మరోసారి ప్రయత్నించగా, ధర్మపురి రోడ్డులోని పొలాస దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 400 జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, 9 బెండిళ్ల డికార్డ్ ఫ్యూజ్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడనే దానిపై విచారించగా…అసలు విషయం బయటపడింది. పట్టుబడిన పేలుడు పదార్థాలు కీసర కేంద్రంగా తయారైనవేనని నిర్ధారణకు వచ్చారు పోలీసులు.

Advertisement

కీసరలో సాల్వోతోపాటు 3 కంపెనీల దాకా పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నాయి. వీటిలో ఏ కంపెనీ నుంచి మావోయిస్టులకు సప్లై చేశారన్నది సస్పెన్స్‌గా మారింది. సాల్వో ఇండస్ట్రీస్.. కీసర కేంద్రంగా పేలుడు పదార్థాలను తయారు చేస్తోంది. నిర్వాహకుడు జయరాం రెడ్డి ఇల్లీగల్‌ అనుమతులతో ఈ దందా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయ్‌. సర్కారు భూముల్లోనే సాల్వో ఇండస్ట్రీస్ సంస్థను నడిపిస్తున్నాడు.

Also Read: మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Advertisement

మావోయిస్టులే కాదు ఉగ్రవాదులకూ పేలుడు పదార్థాలు ఇక్కడి నుంచే వెళ్లాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రకు ప్లాన్ జరిగింది. విజయనగరానికి చెందిన సిరాజ్‌, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో వారు సంచలన నిజాలను బయటపెట్టారు. నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఇందుకు జిలిటెన్ స్టిక్స్ పెద్ద మొత్తంలో సేకరించారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×