E-Paper
Advertisement

‘బంగారం కొనకండి’.. ఇందిరా గాంధీ పాత పేపర్ క్లిప్పింగ్ నిజమేనా?

‘బంగారం కొనకండి’.. ఇందిరా గాంధీ పాత పేపర్ క్లిప్పింగ్ నిజమేనా?
Advertisement

Indira Gandhi Gold Statement: దేశ ప్రజలను ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మెుదలైంది. ఈ క్రమంలోనే ఓ పేపర్ క్లిప్ సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం.. భారతీయులను బంగారం కొనవద్దని కోరినట్లుగా ఉన్న ఫొటో ఒకటి ట్రెండింగ్ అవుతోంది. అయితే ఇందులో నిజానిజాలేంటి? ఇప్పుడు చూద్దాం.

మ్యాటర్ ఏంటంటే?

1967 జూన్ 6 నాటి ‘ది హిందూ’ (The Hindu) పత్రికా క్లిప్పింగ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ‘బంగారం కొనకండి.. ప్రజలకు ఇందిర పిలుపు. జాతీయ క్రమశిక్షణ పాటించాలని విజ్ఞప్తి’ (Don’t buy gold, Indira tells people; appeals for ‘national discipline’) అనే హెడ్ లైన్ కనిపిస్తోంది. దీంతో ప్రధాని మోదీ తరహాలోనే గతంలోనూ ఇందిరా పిలుపునిచ్చారని చాలా మంది చర్చించుకుంటున్నారు.

Advertisement

నిజమా? అబద్దమా?

అయితే వైరల్ అవుతున్న పేపర్ క్లిప్ అసలైందని కాదాని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు ధ్రువీకరించారు. అది డిజిటల్ పద్దతిలో ఎడిట్ చేసినదిగా తేల్చేశారు. అసలు జూన్ 6, 1967 నాటి ‘ది హిందూ’ పత్రిక మొదటి పేజీలో ఇలాంటి వార్త ఏదీ రాలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వార్త వైరల్ కావడంతో ‘ది హిందూ’ యాజమాన్యం సైతం స్పందించింది. తమ పత్రిక పేరుతో చలామణి అవుతున్న ఆ క్లిప్పింగ్ నకిలీదని, తమ ఆర్కైవ్స్‌లో అలాంటి వార్త లేదని అధికారికంగా స్పష్టం చేసింది.

ప్రధాని మోదీ ఏమన్నారంటే?

Advertisement

ప్రధాని మోదీ మే 10వ తేదీన హైదరాబాద్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు అనవసరంగా బంగారం కొనవద్దని, వివాహాల వంటి సందర్భాల్లోనూ నియంత్రణ పాటించాలని కోరారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. గతంలో ఇందిరా గాంధీ కూడా ఇలాగే అన్నారని చూపేందుకు నకిలీ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే రెండో విడత స్టార్ట్.. మంత్రి పొంగులేటి ప్రకటన

గోల్ట్ కంట్రోల్ యాక్ట్..

గోల్డ్ కొనుగోలు చేయవద్దని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. దానిని నియంత్రించే చట్టాన్ని మాత్రం ఆమె తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 1968లో ‘గోల్డ్ కంట్రోల్ యాక్ట్’ (Gold Control Act) ను ఆమె అమల్లోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రజలు బంగారు కడ్డీలు, నాణేల రూపంలో బంగారం ఉంచుకోవడాన్ని నిషేధించారు. కేవలం ఆభరణాల రూపంలో మాత్రమే పరిమిత పరిమాణంలో బంగారం ఉంచుకోవడానికి ఆమె అనుమతి ఇచ్చారు. అయితే ఈ చట్టాన్ని 1990లో రద్దు చేశారు.

Also Read: ప్రజలను విభజించే.. సనాతనాన్ని నిర్మూలించాలి.. ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×