Hyderabad Flyover: నిత్యం రద్దీతో సతమతమవుతూ ఉన్న హైదరాబాద్ నగర వాసులకు ప్రభుత్వం ఓ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో ఐటీ కారిడార్, కూకట్ పల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రయాణం చేసే వారికి ఇదో పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. నిత్యం రద్దీగా ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్న ప్రజలకోసం తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అల్విన్ కాలనీ నుండి మియాపూర్ వరకు ట్రాఫిక్ ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ఫ్లైఓవర్ ని నిర్మిచనుంది. అందుకుగాను ప్రభుత్వం రూ.530 కోట్ల రూపాయలతో భారీ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నగరంలో అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూకట్పల్లి, జేఎన్టీయూ, మియాపూర్ మార్గం ముందువరుసలో ఉంటాయి. అయితే రోజు ఆఫీస్ టైమ్లలో సిగ్నల్లు దాటాలంటే నిమిషాల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో ప్రయాణికులు ఈ రూట్లో ప్రయాణించాలంటే చుక్కలు చూస్తున్నారు. దీనికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుతో సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం 1.8 కిలోమీటర్ల పొడవుతో ఈ భారీ ఫ్లైఓవర్ను రూపకల్పన చేసింది. దీని అంచనా వ్యయాన్ని 530 కోట్లకు టార్గెట్ గా పెట్టుకుంది. దీనికి పూర్తి డిజైన్ మొత్తం రెండువైపులా కలిసి 6 లైన్ల రోడ్లు 24 మీటర్ల పోడవుతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు 200 కొట్లు పెట్టారు. దీంతో జేఏన్టీయు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ తగ్గనుంది. మరియు ప్రయాణ సమయం ఇధన ఖర్చులు లక్షలాది మందికి ఉపశమనం కలగనుంది.
Also Read: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే రెండో విడత స్టార్ట్.. మంత్రి పొంగులేటి ప్రకటన
ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిధులు మంజూరు చేయడంతో అధికారులు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి అన్నీ అనుమతులు సకాలంలో వస్తే ప్రభుత్వం దీనిని వచ్చే నెల జూన్ నాటికి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు మరిత మేలు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also read: తెలంగాణ క్యాబినెట్లో కోత.. మంత్రుల్లో మొదలైన వణుకు.. సీఎం వద్ద మంత్రుల రిపోర్డు కార్డు!