E-Paper
Advertisement

Ponnam Prabhakar: బంగారు తెలంగాణ చేసుంటే.. ప్రజావాణికి ప్రజలు బారులు ఎందుకు తీరుతారు ..?

Ponnam Prabhakar:  బంగారు తెలంగాణ చేసుంటే.. ప్రజావాణికి ప్రజలు బారులు ఎందుకు తీరుతారు ..?

Ponnam Prabhakar: రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని బీఆర్ఎస్ నేతలు గ్రహించాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు . గతంలో బంగారు పాలన అందించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.. బంగారు పాలన అందిస్తే ప్రజావాణి కోసం ప్రజలు ఎందుకు బారులు తీరుతారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను‌ ఖచ్చితంగా అమలు చేస్తుందని అందులో సందేహించాల్సిన అవసరమేమి లేదని పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

కేంద్రపైనా మంత్రి పొన్నం విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని, ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ఎంపీ సిఫార్సుల వల్లే నిందితులకు పాస్‌లు వచ్చాయని ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.

పార్లమెంట్ ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పొన్నం ప్రశ్నించారు. పార్లమెంట్‌ భద్రత అంశంపై తక్షణమే విచారణ జరపాలన్నారు. విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×