E-Paper
Advertisement

Ponnam Prabhakar: బంగారు తెలంగాణ చేసుంటే.. ప్రజావాణికి ప్రజలు బారులు ఎందుకు తీరుతారు ..?

Ponnam Prabhakar:  బంగారు తెలంగాణ చేసుంటే.. ప్రజావాణికి ప్రజలు బారులు ఎందుకు తీరుతారు ..?
Advertisement

Ponnam Prabhakar: రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని బీఆర్ఎస్ నేతలు గ్రహించాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు . గతంలో బంగారు పాలన అందించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.. బంగారు పాలన అందిస్తే ప్రజావాణి కోసం ప్రజలు ఎందుకు బారులు తీరుతారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను‌ ఖచ్చితంగా అమలు చేస్తుందని అందులో సందేహించాల్సిన అవసరమేమి లేదని పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

కేంద్రపైనా మంత్రి పొన్నం విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని, ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ఎంపీ సిఫార్సుల వల్లే నిందితులకు పాస్‌లు వచ్చాయని ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.

Advertisement

పార్లమెంట్ ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పొన్నం ప్రశ్నించారు. పార్లమెంట్‌ భద్రత అంశంపై తక్షణమే విచారణ జరపాలన్నారు. విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×